సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ని తెగ ఊరిస్తూ వచ్చిన ఎస్ఎస్ఎంబి 28 అఫీషియల్ అప్ డేట్ వచ్చేసింది. 2024 సంక్రాంతిని టార్గెట్ చేసుకుని జనవరి 13 విడుదల చేయబోతున్నట్టు హారికా హాసిని అధికారికంగా ప్రకటించింది. ఒక రోజు ముందు ప్రాజెక్ట్ కె వస్తున్నట్టు వైజయంతి మూవీస్ గతంలోనే లాక్ చేసిన నేపథ్యంలో పోటీకి భయపడకుండా నిర్మాత నాగ వంశీ బృందం నిర్ణయం తీసేసుకుంది. బరిలో ఇంకెవరు ఉంటారోనన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రేపు ఫస్ట్ లుక్ తో రాబోయే రామ్ చరణ్ 15 కూడా ఇదే పండగ అంటే క్లాష్ ఆసక్తికరంగా మారుతుంది.
పోస్టర్ లో మహేష్ ఊర మాస్ ని రివీల్ చేశారు. పూర్తి మొహాన్ని చూపించకుండా సిగరెట్ తాగుతూ నడుస్తున్న పోస్టర్ ఊర మాస్ గా ఉంది. అయితే టైటిల్ మాత్రం దాచి పెట్టేశారు. అమరావతికి అటుఇటు, గుంటూరు కారం, మొనగాడు ఇలా ఏవేవో పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ హీరో దర్శకుడు ఫైనల్ గా ఒక అభిప్రాయానికి రాలేకపోయారట. ప్రతిదానికి ఫ్యాన్స్ నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో ఇంకొంత కాలం ఆగాలని డిసైడ్ అయ్యారు. ఎలాగూ ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది కాబట్టి ఎలాంటి హడావిడి పోనక్కర్లేదు
కూల్ గా ఇంకా మంచి టైటిల్ ని ఎంచుకోవచ్చు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వచ్చిన ఒత్తిడికి సితార సంస్థ తలొగ్గింది. పైగా ఇతర ప్రొడ్యూసర్లు ఫిక్స్ చేసుకోకముందే ముందే జాగ్రత్త పడితే మంచిదనే కోణంలో ఇలా చేసినట్టు కనిపిస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ మాస్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఆగస్ట్ 11న వస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్న అభిమానులు కొంత నిరాశ చెందినా సరిలేరు నీకెవ్వరు – అల వైకుంఠపురములోలు సంక్రాంతికి రికార్డులు బద్దలు కొట్టిన నేపథ్యంలో మహేష్ త్రివిక్రమ్ లకు ఆ సెంటిమెంట్ కూడా కలిసొస్తుంది
This post was last modified on March 26, 2023 6:50 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…