సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం ఈ రోజుల్లో చాలా చాలా కష్టమైపోతోంది. 70, 80 దశకాల్లో మాదిరి హీరోలు తమ వయసులో మూడో వంతున్న హీరోయిన్లతో ఏ ఫీలింగ్ లేకుండా రొమాన్స్ చేసే పరిస్థితి లేదిప్పుడు. అలా చేస్తే ప్రేక్షకుల నుంచి వెటకారాలు తప్పవు. సీనియర్ల పక్కన యంగ్గా అనిపించే హీరోయిన్లను పెడితే.. అదో రకమైన ఫీలింగ్ వచ్చేస్తోంది జనాలకు. వాళ్ల కెమిస్ట్రీ, రొమాన్స్ అస్సలు వర్కవుట్ కావడం లేదు. దీంతో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురికీ హీరోయిన్ల సమస్య తప్పట్లేదు.
తన చివరి సినిమా ‘ఎఫ్-3’లో తమన్నాతో జోడీ కట్టాడు వెంకీ. ఇప్పుడు ఆయన ‘హిట్’ డైరెక్టర్ శైలేష్ కొలనుతో ‘సైంధవ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కథానాయికగా రుహాని శర్మను అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే ఆమెది ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్ర అట. మెయిన్ లీడ్ కోసం వేరే అమ్మాయిని ఎంచుకున్నారు. ఆ అమ్మాయి కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ అని సమాచారం. శ్రద్ధ ఈ తరం హీరోయినే అయినా.. వెంకీ సరసన ఆమె ఆడ్గా ఏమీ అనిపించకపోవచ్చు. తెలుగులో ఆమె నటిస్తున్న అత్యంత పెద్ద సినిమా ఇదే కానుంది. తెలుగులో ఆమెకు కృష్ణ అండ్ హిజ్ లీల, జెర్సీ లాంటి మంచి సినిమాలున్నాయి.
‘సైంధవ్’లో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి విలన్ పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో చూస్తే ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కనిపించింది. వెంకీకిది 75వ సినిమా కావడం విశేషం.
This post was last modified on April 3, 2023 9:48 am
టాలీవుడ్లో అత్యంత నిరాశాజనకంగా సాగిన వేసవి సీజన్లలో 2025 ఒకటి. ఆ సంవత్సరం ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా…
టాలీవుడ్లో హీరోగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే పెద్ద రేంజికి చేరుకుని.. ఆ తర్వాత సుదీర్ఘమైన ఫ్లాప్…
టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తలపెట్టి రామాయల నిర్మాణానికి సంబంధించిన ఇక్కట్లు దాదాపు తొలిగిపోయాయి. ఆయన సొంత…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అసామాన్యులు విజయం దక్కించుకోవడం.. వారసులు గెలుపు గుర్రాలు ఎక్కడం.. వరుస విజయాలు దక్కించుకున్న హేమాహేమీలు…
చైనాలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనా ఈస్టర్న్…
పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లబోతూ తమిళ టాప్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం.. జననాగయన్. ఇది తెలుగు హిట్…