మెగాస్టార్ తో ఎప్పుడైనా సినిమా తీయడానికి అందుబాటులో ఉండే వి.వి. వినాయక్ మళ్ళీ మెగాస్టార్ సినిమాకు పగ్గాలు చేపడుతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. లూసిఫర్ రీమేక్ నుంచి సుజీత్ తప్పుకున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ తో సినిమా చేయడానికి సాహో దర్శకుడు యు.వి. కాంపౌండ్ కి వెళ్ళిపోయాడు. ఆచార్య షూటింగ్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది కనుక, ఒక రీమేక్ కథపై అన్నాళ్ళు కాలయాపన చేయడం కరెక్ట్ కాదని భావించి సుజీత్ వెళ్ళిపోయాడట. దాంతో లూసిఫర్ ఆగిపోయినట్టేనని వెబ్ లో వార్తలొచ్చాయి. కానీ ఆ మాస్ పాత్ర చేయడానికి చిరంజీవి ఫిక్సయ్యారు.
తన ఏజ్ కి తగ్గ పాత్ర కనుక ఆచార్య తర్వాత అదే చేస్తారు. మాస్ సినిమాలు తీయడంలో అనుభవం ఉన్న వినాయక్ అయితే బాగా హేండిల్ చేస్తాడని అతనికి భాద్యతలు అప్పగించినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. వినాయక్ ఫామ్ లో లేకపోయినా కానీ ఠాగూర్, ఖైదీ నంబర్ 150 చిత్రాలను విజయవంతంగా రీమేక్ చేసాడు కనుక లూసిఫర్ కూడా అతని చేతిలో పెడుతున్నట్టు టాక్.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…