మెగాస్టార్ తో ఎప్పుడైనా సినిమా తీయడానికి అందుబాటులో ఉండే వి.వి. వినాయక్ మళ్ళీ మెగాస్టార్ సినిమాకు పగ్గాలు చేపడుతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. లూసిఫర్ రీమేక్ నుంచి సుజీత్ తప్పుకున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ తో సినిమా చేయడానికి సాహో దర్శకుడు యు.వి. కాంపౌండ్ కి వెళ్ళిపోయాడు. ఆచార్య షూటింగ్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది కనుక, ఒక రీమేక్ కథపై అన్నాళ్ళు కాలయాపన చేయడం కరెక్ట్ కాదని భావించి సుజీత్ వెళ్ళిపోయాడట. దాంతో లూసిఫర్ ఆగిపోయినట్టేనని వెబ్ లో వార్తలొచ్చాయి. కానీ ఆ మాస్ పాత్ర చేయడానికి చిరంజీవి ఫిక్సయ్యారు.
తన ఏజ్ కి తగ్గ పాత్ర కనుక ఆచార్య తర్వాత అదే చేస్తారు. మాస్ సినిమాలు తీయడంలో అనుభవం ఉన్న వినాయక్ అయితే బాగా హేండిల్ చేస్తాడని అతనికి భాద్యతలు అప్పగించినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. వినాయక్ ఫామ్ లో లేకపోయినా కానీ ఠాగూర్, ఖైదీ నంబర్ 150 చిత్రాలను విజయవంతంగా రీమేక్ చేసాడు కనుక లూసిఫర్ కూడా అతని చేతిలో పెడుతున్నట్టు టాక్.
This post was last modified on July 30, 2020 12:37 am
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…