కృష్ణ వంశీ ఒక మంచి సినిమాతో ఎప్పుడెప్పుడు కం బ్యాక్ ఇస్తాడా ? అని ఎదురుచూసిన మూవీ లవర్ కి ‘రంగమార్తాండ’ అ లోటు తీర్చేసింది. రిలీజ్ కి ముందే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కృష్ణ వంశీ తన నెక్స్ట్ సినిమా ‘అన్నం’ ను మైత్రి లో చేయబోతున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
తాజాగా దీనిపై దర్శకుడు కృష్ణ వంశీ స్పందించాడు. అన్నం సినిమాను మైత్రి బేనర్ లో చేయబోతున్నట్టు వచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. రంగమార్తాండ ను వాళ్ళు రిలీజ్ చేయడం వల్లే ఆ రూమర్ వచ్చిందని భావిస్తున్నా అంటూ చెప్పుకున్నారు. నెక్స్ట్ సినిమాగా అన్నం చేయబోతున్నాని దాని డీటైల్స్ త్వరలోనే చెప్తానని అన్నారు.
అయితే అన్నం సినిమా మన కథ. మనందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ అన్నది మాత్రం చెప్పగలను అంటూ తెలిపారు వంశీ. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైక వెళ్తుందో చెప్పలేనని మన చేతిలో ఏం ఉండదని అంతా డెస్టినీ నిర్ణయిస్తుందని వేదాంతం పలికారు.
This post was last modified on March 25, 2023 6:55 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…