కృష్ణ వంశీ ఒక మంచి సినిమాతో ఎప్పుడెప్పుడు కం బ్యాక్ ఇస్తాడా ? అని ఎదురుచూసిన మూవీ లవర్ కి ‘రంగమార్తాండ’ అ లోటు తీర్చేసింది. రిలీజ్ కి ముందే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కృష్ణ వంశీ తన నెక్స్ట్ సినిమా ‘అన్నం’ ను మైత్రి లో చేయబోతున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
తాజాగా దీనిపై దర్శకుడు కృష్ణ వంశీ స్పందించాడు. అన్నం సినిమాను మైత్రి బేనర్ లో చేయబోతున్నట్టు వచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. రంగమార్తాండ ను వాళ్ళు రిలీజ్ చేయడం వల్లే ఆ రూమర్ వచ్చిందని భావిస్తున్నా అంటూ చెప్పుకున్నారు. నెక్స్ట్ సినిమాగా అన్నం చేయబోతున్నాని దాని డీటైల్స్ త్వరలోనే చెప్తానని అన్నారు.
అయితే అన్నం సినిమా మన కథ. మనందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ అన్నది మాత్రం చెప్పగలను అంటూ తెలిపారు వంశీ. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైక వెళ్తుందో చెప్పలేనని మన చేతిలో ఏం ఉండదని అంతా డెస్టినీ నిర్ణయిస్తుందని వేదాంతం పలికారు.
This post was last modified on March 25, 2023 6:55 am
కేశినేని బ్రదర్స్ మధ్య రాజుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణల వ్యవహారం ఏపీలో కలకలమే రేపుతోంది. పదేళ్ల పాటు విజయవాడ ఎంపీగా నాని…
ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తూ తనకో బ్లాక్ బస్టర్ ఇస్తాడని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మీద సూర్య పెట్టుకున్న నమ్మకం…
అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా…
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..…