కృష్ణ వంశీ ఒక మంచి సినిమాతో ఎప్పుడెప్పుడు కం బ్యాక్ ఇస్తాడా ? అని ఎదురుచూసిన మూవీ లవర్ కి ‘రంగమార్తాండ’ అ లోటు తీర్చేసింది. రిలీజ్ కి ముందే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కృష్ణ వంశీ తన నెక్స్ట్ సినిమా ‘అన్నం’ ను మైత్రి లో చేయబోతున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
తాజాగా దీనిపై దర్శకుడు కృష్ణ వంశీ స్పందించాడు. అన్నం సినిమాను మైత్రి బేనర్ లో చేయబోతున్నట్టు వచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. రంగమార్తాండ ను వాళ్ళు రిలీజ్ చేయడం వల్లే ఆ రూమర్ వచ్చిందని భావిస్తున్నా అంటూ చెప్పుకున్నారు. నెక్స్ట్ సినిమాగా అన్నం చేయబోతున్నాని దాని డీటైల్స్ త్వరలోనే చెప్తానని అన్నారు.
అయితే అన్నం సినిమా మన కథ. మనందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ అన్నది మాత్రం చెప్పగలను అంటూ తెలిపారు వంశీ. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైక వెళ్తుందో చెప్పలేనని మన చేతిలో ఏం ఉండదని అంతా డెస్టినీ నిర్ణయిస్తుందని వేదాంతం పలికారు.
This post was last modified on March 25, 2023 6:55 am
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…