ఈ మధ్య కాలంలో పెద్దగా అంచనాల్లేకుండా, ప్రమోషన్లు కూడా లేకుండా విడుదలై.. కేవలం మౌత్ టాక్తో పుంజుకుని పెద్ద విజయం సాధించిన చిన్న సినిమా అంటే.. బలగం అనే చెప్పాలి. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించినప్పటికీ ఈ సినిమాకు రిలీజ్ ముందు పెద్ద పబ్లిసిటీ ఏమీ చేయలేదు. ఆయన స్టయిల్లో పెద్ద బడ్జెట్ కూడా పెట్టలేదు.
తమిళం, మలయాళంలో వచ్చే సహజమైన నేటివిటీ ఉన్న సినిమాలను గుర్తు చేస్తూ ఈ సినిమా తెలంగాణ వారినే కాక అందరినీ ఆకట్టుకుంది. నైజాంలో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. తొలి వారం కంటే రెండో వారంలో ఈ సినిమా వసూళ్లు ఎక్కువ ఉన్నాయి. మూడో వారంలో కూడా నిలకడగా కలెక్షన్లు రాబడుతూ సాగుతోందీ చిత్రం. కానీ ఇంతలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఐతే ఈ సినిమా ఇంత బాగా ఆడేస్తుందని దిల్ రాజుకు కూడా అంచనా లేనట్లుంది. అందుకే థియేట్రికల్ రిలీజ్ తర్వాత మూడు వారాలకు ఓటీటీలో విడుదల చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అమేజాన్ ప్రైమ్లో ఈ సినిమా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతున్న విషయం అధికారికంగా వెల్లడైంది. కానీ ఈ విషయం చిత్ర హీరోయిన్లు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్లకు తెలియకపోవడం గమనార్హం. అమేజాన్ ప్రైమ్లో సినిమా రిలీజ్ కానున్న విషయాన్ని ఎవరో ప్రస్తావిస్తే.. అది నిజం కాదని, ఈ రూమర్లు నమ్మొద్దని, సినిమాను థియేటర్లకు వెళ్లి చూడాలని అతను సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. కావ్య సైతం ఇలాగే సినిమాను ప్రమోట్ చేసింది.
కానీ తీరా చూస్తే ప్రైమ్ అధికారికంగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి ప్రైమ్ వాళ్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. దీన్ని బట్టి మూడు వారాలకే ఓటీటీ రిలీజ్ విషయం హీరో హీరోయిన్లు సహా టీంలోని ముఖ్యులకే తెలియదన్నమాట.
This post was last modified on March 24, 2023 9:21 pm
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…