ఈ మధ్య కాలంలో పెద్దగా అంచనాల్లేకుండా, ప్రమోషన్లు కూడా లేకుండా విడుదలై.. కేవలం మౌత్ టాక్తో పుంజుకుని పెద్ద విజయం సాధించిన చిన్న సినిమా అంటే.. బలగం అనే చెప్పాలి. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించినప్పటికీ ఈ సినిమాకు రిలీజ్ ముందు పెద్ద పబ్లిసిటీ ఏమీ చేయలేదు. ఆయన స్టయిల్లో పెద్ద బడ్జెట్ కూడా పెట్టలేదు.
తమిళం, మలయాళంలో వచ్చే సహజమైన నేటివిటీ ఉన్న సినిమాలను గుర్తు చేస్తూ ఈ సినిమా తెలంగాణ వారినే కాక అందరినీ ఆకట్టుకుంది. నైజాంలో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. తొలి వారం కంటే రెండో వారంలో ఈ సినిమా వసూళ్లు ఎక్కువ ఉన్నాయి. మూడో వారంలో కూడా నిలకడగా కలెక్షన్లు రాబడుతూ సాగుతోందీ చిత్రం. కానీ ఇంతలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఐతే ఈ సినిమా ఇంత బాగా ఆడేస్తుందని దిల్ రాజుకు కూడా అంచనా లేనట్లుంది. అందుకే థియేట్రికల్ రిలీజ్ తర్వాత మూడు వారాలకు ఓటీటీలో విడుదల చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అమేజాన్ ప్రైమ్లో ఈ సినిమా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతున్న విషయం అధికారికంగా వెల్లడైంది. కానీ ఈ విషయం చిత్ర హీరోయిన్లు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్లకు తెలియకపోవడం గమనార్హం. అమేజాన్ ప్రైమ్లో సినిమా రిలీజ్ కానున్న విషయాన్ని ఎవరో ప్రస్తావిస్తే.. అది నిజం కాదని, ఈ రూమర్లు నమ్మొద్దని, సినిమాను థియేటర్లకు వెళ్లి చూడాలని అతను సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. కావ్య సైతం ఇలాగే సినిమాను ప్రమోట్ చేసింది.
కానీ తీరా చూస్తే ప్రైమ్ అధికారికంగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి ప్రైమ్ వాళ్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. దీన్ని బట్టి మూడు వారాలకే ఓటీటీ రిలీజ్ విషయం హీరో హీరోయిన్లు సహా టీంలోని ముఖ్యులకే తెలియదన్నమాట.
This post was last modified on March 24, 2023 9:21 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…