Movie News

‘బలగం’ హీరో హీరోయిన్లకు బిగ్ షాక్

ఈ మధ్య కాలంలో పెద్దగా అంచనాల్లేకుండా, ప్రమోషన్లు కూడా లేకుండా విడుదలై.. కేవలం మౌత్ టాక్‌తో పుంజుకుని పెద్ద విజయం సాధించిన చిన్న సినిమా అంటే.. బలగం అనే చెప్పాలి. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించినప్పటికీ ఈ సినిమాకు రిలీజ్ ముందు పెద్ద పబ్లిసిటీ ఏమీ చేయలేదు. ఆయన స్టయిల్లో పెద్ద బడ్జెట్ కూడా పెట్టలేదు.

తమిళం, మలయాళంలో వచ్చే సహజమైన నేటివిటీ ఉన్న సినిమాలను గుర్తు చేస్తూ ఈ సినిమా తెలంగాణ వారినే కాక అందరినీ ఆకట్టుకుంది. నైజాంలో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. తొలి వారం కంటే రెండో వారంలో ఈ సినిమా వసూళ్లు ఎక్కువ ఉన్నాయి. మూడో వారంలో కూడా నిలకడగా కలెక్షన్లు రాబడుతూ సాగుతోందీ చిత్రం. కానీ ఇంతలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఐతే ఈ సినిమా ఇంత బాగా ఆడేస్తుందని దిల్ రాజుకు కూడా అంచనా లేనట్లుంది. అందుకే థియేట్రికల్ రిలీజ్ తర్వాత మూడు వారాలకు ఓటీటీలో విడుదల చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతున్న విషయం అధికారికంగా వెల్లడైంది. కానీ ఈ విషయం చిత్ర హీరోయిన్లు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్‌లకు తెలియకపోవడం గమనార్హం. అమేజాన్ ప్రైమ్‌లో సినిమా రిలీజ్ కానున్న విషయాన్ని ఎవరో ప్రస్తావిస్తే.. అది నిజం కాదని, ఈ రూమర్లు నమ్మొద్దని, సినిమాను థియేటర్లకు వెళ్లి చూడాలని అతను సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. కావ్య సైతం ఇలాగే సినిమాను ప్రమోట్ చేసింది.

కానీ తీరా చూస్తే ప్రైమ్ అధికారికంగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి ప్రైమ్ వాళ్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. దీన్ని బట్టి మూడు వారాలకే ఓటీటీ రిలీజ్ విషయం హీరో హీరోయిన్లు సహా టీంలోని ముఖ్యులకే తెలియదన్నమాట.

This post was last modified on March 24, 2023 9:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

3 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago