Movie News

టాలీవుడ్లో కొత్త స్టార్.. నవరసరాయ

ఒక హీరో కొన్ని విజయాలందుకుని, కొంత స్టార్ ఇమేజ్, ఫాలోయింగ్ సంపాదించాడంటే.. ఆటోమేటిగ్గా తన పేరు వెనుక ఒక ట్యాగ్ వచ్చేస్తుంది. వారసత్వ నేపథ్యంతో వచ్చే హీరోల సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. ఒకట్రెండు సినిమాలకే ట్యాగ్ పడిపోతోంది.

ఐతే ఇప్పుడు ఓ సీనియర్ హీరో 50 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత కొత్తగా ఇప్పుడు తన పేరు పక్కన ఒక ట్యాగ్ వేసుకున్నాడు. ఆ నటుడు నరేష్ కాగా.. ఆయన పేరు వెనక వచ్చి చేరిన ట్యాగ్.. నవరసరాయ. నరేష్.. ఆయనతో కలిసి జీవిస్తున్న పవిత్ర నరేష్ జంటగా ‘మళ్ళీ పెళ్ళి’ అనే సినిమా చేస్తున్న సంగతి తాజాగా వెల్లడైంది.

ఈ రోజే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను స్వయంగా నరేషే నిర్మిస్తుండటం విశేషం. ఈ పోస్టర్ మీద నరేష్ పేరు ముందు ‘నవరసరాయ’ అనే ట్యాగ్ జోడించారు. 50 ఏళ్ల ఆయన ఘన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేశారు. నరేష్ తెలుగు సినిమా చరిత్రలోనే మేటి నటుల్లో ఒకడనడంలో సందేహం లేదు. హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన పాత్రలు చేశాడు. తన దగ్గరికొచ్చిన ప్రతి పాత్రకూ న్యాయం చేశాడు. పాత్రల్లో ఆయన చూపించే వేరియేషన్ అసాధారణం.

ఐతే హీరోగా ఎన్నో విజయాలందుకుని ఓ మోస్తరు స్టార్ ఇమేజ్ కూడా సంపాదించినప్పటికీ.. ఏ రోజూ నరేష్ తన పేరు వెనుక బిరుదులు చేర్చుకున్నది లేదు. కానీ ఇప్పుడు ఈ వయసులో లీడ్ రోల్ చేస్తూ.. వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న టైంలో ఇలా తన పేరు ముందు బిరుదు తగిలించుకోవడంతో కొంత ట్రోలింగ్‌కు గురవుతున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే.. నరేష్ తన వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టి ‘మళ్ళీ పెళ్ళి’ అనే సినిమా తీయడం.. దానికి సీనియర్ దర్శక నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తుండటం మాత్రం ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించేదే.

This post was last modified on March 24, 2023 8:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

3 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago