‘దసరా’ సినిమాతో పెద్ద సాహసమే చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. నాని సినిమాలు వేరే భాషల్లో రిలీజ్ కావడం కొత్తేమీ కాదు. అతను తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రం చేశాడు. అతడి మరికొన్ని సినిమాలు తమిళంలో రిలీజయ్యాయి. కొన్ని హిందీలో డబ్ అయ్యాయి. ‘అంటే సుందరానికీ’ మలయాళంలో రిలీజైంది. కానీ ఈసారి అతను పూర్తి స్థాయి పాన్ ఇండియా చిత్రంలో నటించాడు. ఆరంభమైన దగ్గర్నుంచి ‘దసరా’ను పాన్ ఇండియా సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇక రిలీజ్ ముంగిట ప్రమోషన్లు చూసి.. ఏంటీ దూకుడు అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది.
నాని ముంబయి, బెంగళూరు, చెన్నై, కోచి.. ఇలా నాలుగు సిటీలు ఎంచుకుని ఒక్కో గంట పాటు ప్రెస్ మీట్లు పెట్టి వచ్చేస్తాడని అనుకున్నారు. కానీ అతను గట్టి ప్లానింగ్తోనే రంగంలోకి దిగాడు. ఉత్తరాదిన లక్నో సహా వేర్వేరు నగరాల్లో తిరిగాడు. సౌత్కు వచ్చి ఇక్కడ పలు చోట్ల ప్రమోషన్లు చేస్తున్నాడు. సినిమా పాన్ ఇండియా అంటే సరిపోదు.. ప్రమోషన్ కూడా పాన్ ఇండియా అనిపించాలి అని నానిని చూస్తే అర్థమవుతుంది. హీరోగా నాని ఎదుగుదల ఒక ఆదర్శమైతే.. ఇప్పుడు ప్రమోషన్ల విషయంలో అతను అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఐతే నాని పడ్డ కష్టానికి ఎంతమేర ఫలితం దక్కుతుందన్న దాని మీదే ఇప్పుడు అందరి దృష్టీ నిలిచి ఉంది. ‘దసరా’ ప్రమోషనల్ కంటెంట్, నాని కష్టం తెలుగు రాష్ట్రాల అవతల ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి రేకెత్తించి ఉంటుంది.. మిగతా భాషల్లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఒకేసారి అద్భుతాలు ఆశించలేం కానీ.. ‘పుష్ప’ సినిమాలాగా కంటెంట్ కనెక్ట్ అయితే.. నెమ్మదిగా సినిమా గట్టి ప్రభావం చూపే అవకాశాలను కొట్టిపారేయలేం.
This post was last modified on March 24, 2023 6:49 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…