‘దసరా’ సినిమాతో పెద్ద సాహసమే చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. నాని సినిమాలు వేరే భాషల్లో రిలీజ్ కావడం కొత్తేమీ కాదు. అతను తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రం చేశాడు. అతడి మరికొన్ని సినిమాలు తమిళంలో రిలీజయ్యాయి. కొన్ని హిందీలో డబ్ అయ్యాయి. ‘అంటే సుందరానికీ’ మలయాళంలో రిలీజైంది. కానీ ఈసారి అతను పూర్తి స్థాయి పాన్ ఇండియా చిత్రంలో నటించాడు. ఆరంభమైన దగ్గర్నుంచి ‘దసరా’ను పాన్ ఇండియా సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇక రిలీజ్ ముంగిట ప్రమోషన్లు చూసి.. ఏంటీ దూకుడు అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది.
నాని ముంబయి, బెంగళూరు, చెన్నై, కోచి.. ఇలా నాలుగు సిటీలు ఎంచుకుని ఒక్కో గంట పాటు ప్రెస్ మీట్లు పెట్టి వచ్చేస్తాడని అనుకున్నారు. కానీ అతను గట్టి ప్లానింగ్తోనే రంగంలోకి దిగాడు. ఉత్తరాదిన లక్నో సహా వేర్వేరు నగరాల్లో తిరిగాడు. సౌత్కు వచ్చి ఇక్కడ పలు చోట్ల ప్రమోషన్లు చేస్తున్నాడు. సినిమా పాన్ ఇండియా అంటే సరిపోదు.. ప్రమోషన్ కూడా పాన్ ఇండియా అనిపించాలి అని నానిని చూస్తే అర్థమవుతుంది. హీరోగా నాని ఎదుగుదల ఒక ఆదర్శమైతే.. ఇప్పుడు ప్రమోషన్ల విషయంలో అతను అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఐతే నాని పడ్డ కష్టానికి ఎంతమేర ఫలితం దక్కుతుందన్న దాని మీదే ఇప్పుడు అందరి దృష్టీ నిలిచి ఉంది. ‘దసరా’ ప్రమోషనల్ కంటెంట్, నాని కష్టం తెలుగు రాష్ట్రాల అవతల ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి రేకెత్తించి ఉంటుంది.. మిగతా భాషల్లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఒకేసారి అద్భుతాలు ఆశించలేం కానీ.. ‘పుష్ప’ సినిమాలాగా కంటెంట్ కనెక్ట్ అయితే.. నెమ్మదిగా సినిమా గట్టి ప్రభావం చూపే అవకాశాలను కొట్టిపారేయలేం.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…