మావయ్య పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న వినోదయ సితం రీమేక్ డేట్ జూలై 28 లాక్ చేసి అఫీషియల్ గా ప్రకటించారు. ఇకపై వరసగా అప్డేట్లు ఇస్తూ అభిమానులతో టచ్ లో ఉండేలా ప్రొడక్షన్ టీమ్ స్ట్రాటజీని సిద్ధం చేసుకొంటోంది.. దీనికి దేవుడు టైటిల్ పరిశీలనలో ఉండగా మాటల రచయిత త్రివిక్రమ్, దర్శకుడు సముతిరఖని ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. దేవరా అనుకున్నప్పటికీ దానికన్నా మొదటిదే బాగుందని ఫీలయ్యారట. ఈ వార్త కొద్దివారాల క్రితమే బయటికి వచ్చినా కన్ఫర్మ్ కాలేదు.
ప్రస్తుతం మధ్య మధ్యలో జనసేన వల్ల చిన్న చిన్న బ్రేకులు పడుతున్నా చిత్రీకరణ నాన్ స్టాప్ గా జరుగుతోంది. పవన్ లేని ఎపిసోడ్లను వేగంగా పూర్తి చేస్తున్నారు. జూన్ కంతా ఫస్ట్ కాపీ సిద్ధం చేసి ఆపై ఓ నెల రోజులు ప్రమోషన్లు చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో పవన్ కి హీరోయిన్ ఉండదు. తేజు చెల్లిగా ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తుండగా జోడిగా కేతిక శర్మని ఎంచుకున్నారు. ఒరిజినల్ వెర్షన్ కి చాలా కీలక మార్పులు చేయడంతో ఫ్యాన్స్ గోపాల గోపాలని మించిన ఎంటర్ టైన్మెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
జులై 28కి ఇప్పటిదాకా ఎవరూ కర్చీఫ్ వేయలేదు. స్లాట్ ఖాళీగా ఉంది. బాలీవుడ్ మూవీ రాకీ ఔర్ రాణి ప్రేమ్ కహాని ఒకటే షెడ్యూల్ అయ్యుంది. దేవుడు ఎలాగూ ప్యాన్ ఇండియా ప్రాజెక్టు కాదు కాబట్టి దాని వల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదు. తమన్ సంగీతం మీద మంచి అంచనాలున్నాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో వాటిని మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ రచన పరంగా తప్ప ఇంకే వ్యవహారాల్లోనూ ఉండటం లేదు. మహేష్ బాబు సినిమా తాలూకు పనుల వల్ల కేవలం డైలాగులు రాసివ్వడం వరకే పరిమితమయ్యారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…