రంగమార్తాండ.. ఒకప్పుడు విలక్షణ చిత్రాలతో తెలుగు సినిమాను గొప్ప మలుపు తిప్పిన టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కృష్ణవంశీ నుంచి వచ్చిన కొత్త చిత్రం. విడుదలకు కొన్ని రోజుల ముందునుంచే మీడియా వాళ్లకు, ఫిలిం సెలబ్రెటీలకు ఈ సినిమా స్పెషల్ షోలు వేసి చూపించగా.. అందరూ ప్రశంసల జల్లు కురిపించారు. వాళ్ల మాటలు అతిశయోక్తి కాదని రిలీజ్ తర్వాత వచ్చిన టాక్ను బట్టి అందరికీ అర్థమైంది. సినిమా చూసిన వాళ్లందరూ ఇది మంచి సినిమా, గొప్ప సినిమా అంటున్నారు.
ట్విట్టర్లో, ఫేస్ బుక్లో ఈ సినిమా మీద పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. సినిమా గురించి గొప్పగా విశ్లేషిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీతో పాటు నటీనటులు, టెక్నీషియన్లను కొనియాడుతున్నారు. ఐతే కృష్ణవంశీ అంటే పిచ్చి అభిమానం ఉన్న వాళ్లు, అభిరుచి ఉన్న కొంతమంది ప్రేక్షకులు మాత్రమే ఇప్పటిదాకా సినిమా చూశారు. వీరి సంఖ్య పరిమితంగానే ఉంది.
‘రంగమార్తాండ’ థియేటర్లలో ఆక్యుపెన్సీ చూస్తే సినిమా టాక్కు తగ్గట్లు అయితే లేదు. ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగట్లేదు. రిలీజ్ ముంగిట లో బజ్ వల్ల తొలి రోజు మార్నింగ్ షోలు వెలవెలబోయాయి. ఉగాది సెలవైన ఆ రోజు ఈవెనింగ్ షోలకు పర్వాలేదు. కానీ తర్వాతి రెండు రోజుల్లో వసూళ్ల పరంగా ఆశించిన పెరుగుదల కనిపించలేదు. వీకెండ్కు సినిమా బెటర్గా పెర్ఫామ్ చేస్తుందని ఆశిస్తున్నారు.
సినిమా గురించి గొప్పగా వింటున్న ప్రేక్షకులు.. ఓటీటీలో వస్తే చూద్దాంలే అనుకుంటే ఒక మంచి చిత్రానికి అన్యాయం చేసినట్లే. మంచి సినిమాలు రావట్లేదని నిట్టూరుస్తూ.. అలాంటివి వచ్చినపుడు థియేటర్లకు వెళ్లి ప్రోత్సహించడం, మంచి వసూళ్లు అందించి ఇలాంటి సినిమాలు మరిన్ని వచ్చేలా చూడటం అవసరం. ‘రంగమార్తాండ’కు ఆ రకమైన న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…