ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న నాని దసరా కోసం విపరీతమైన ఆసక్తి నెలకొంది. సంక్రాంతి అయ్యాక సుమారు రెండున్నర నెలల తర్వాత టాలీవుడ్ కో నిఖార్సైన మాస్ సినిమా వస్తోందని, కనక వర్షం ఖాయమని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. హైప్ కూడా క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ మొన్నటి నుంచే పెట్టినా త్వరగా సోల్డ్ అవుట్ దిశగా దూసుకెళ్తున్నాయి. హైప్ ని కనక సరిగ్గా నిలబెట్టుకుంటే ఓపెనింగ్స్ రికార్డులు ఖాయం. దాస్ కా ధమ్కీనే 8 కోట్లు దాటగా లేనిది పాజిటివ్ టాక్ వస్తే మాత్రం దసరా ఊచకోత మాములుగా ఉండదు.
తెలంగాణలో బొగ్గుగనుల నేపథ్యంతో ఒక ఊరిలో జరిగే సంఘటనల ఆధారంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరాని రూపొందించారు. ధరణి ప్రాణ స్నేహితుడు సూరిగా కీలక పాత్ర పోషించిన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టికి చాలా ప్రాధాన్యం ఉంటుందట. ఈ క్యారెక్టర్ కి ఇచ్చే ట్విస్టు వల్లే సెకండ్ హాఫ్ లో నాని విలన్ల మీద ప్రతీకారంతో విరుచుకుపడే ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో వచ్చాయని వినికిడి. ప్రమోషన్లలో దీక్షిత్ ని ఎక్కువ హైలైట్ చేయకపోవడానికి కారణం ఇదే అంటున్నారు. పైగా ఈ ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ లో కీర్తి సురేష్ కు సంబంధించిన మలుపు కూడా షాకింగేనట.
ఇంత ముఖ్యమైన భూమిక పోషించిన దీక్షిత్ శెట్టి ఇప్పటిదాకా శాండల్ వుడ్ లోనూ పెద్దగా సెటిల్ కాలేదు. నటించినవి కూడా తక్కువే. దియా సూపర్ హిట్ కావడం వల్ల మంచి పేరొచ్చింది. దీన్నే తెలుగులో డియర్ మేఘగా రీమేక్ చేశారు కానీ ఇతను నటించలేదు. టాలీవుడ్ డెబ్యూ రెండేళ్ల క్రితం వచ్చిన ముగ్గురు మొనగాళ్లుతో చేశాడు కానీ అది డిజాస్టర్ కావడంతో గుర్తింపు రాలేదు. ఇప్పుడీ దసరాలో నానితో సగంపైగా స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాడు కాబట్టి బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఇక్కడే అవకాశాలు క్యూ కట్టడం ఖాయం. ఇంకో వారంలో తేలిపోతుంది చూద్దాం.
This post was last modified on March 24, 2023 3:33 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…