మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. రైటర్ టర్న్డ్ డైరెక్టర్ కొరటాల శివ ఇలా వరుసగా నాలుగు చిత్రాలు టాప్ హీరోలతో చేయడం.. అవి నాలుగూ సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలుగా మారడం.. టాలీవుడ్లో ఇదొక అరుదైన రికార్డు. చాలా తక్కువ సమయంలో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగిపోయాడాయన.
భారీ చిత్రాలతో బాక్సాఫీస్ సక్సెస్ ఎలా సాధించాలో ఔపోసన పట్టేశాడని.. ఆయనకు ఫెయిల్యూర్ అన్నదే ఉండదనే చాలామంది నమ్మారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. కానీ వీరి కలయికలో వచ్చిన ‘ఆచార్య’ దారుణాతి దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. వరుసగా నాలుగు సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన దర్శకుడు కాస్త తడబడి, రిజల్ట్ కొంచెం తేడా కొడితే ఓకే కానీ.. మరీ అంత పెద్ద డిజాస్టర్ ఇవ్వడం అనూహ్యం. ఇలాంటి రిజల్ట్ తర్వాత కూడా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా సక్సెస్ అందుకుని, తిరుగులేని మార్కెట్ సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ నమ్మకం సడలకుండా సినిమా చేయడం గొప్ప విషయం.
రకరకాల కారణాల వల్ల ఆలస్యం అయిన ఈ చిత్రం ఎట్లకేలకు ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా కొరటాల శివ చాలా ఎమోషనల్గా, అదే సమయంలో కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. కెరీర్ బెస్ట్ ఫిలిం ఇస్తానన్నాడు. ఐతే కొరటాల ముందు ఇప్పుడు మామూలు సవాళ్లు లేవు. కొరటాల కచ్చితంగా బ్లాక్బస్టర్ ఇవ్వాల్సిన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఏమాత్రం తేడా రావడానికి.. చిన్న తప్పు జరగడానికి వీల్లేదు.
‘ఆచార్య’ ఫలితం తర్వాత తనేంటో చాటి చెప్పడమే కాక తనను నమ్మి సినిమా చేస్తున్న తారక్కు అతడి కొత్త స్టార్ ఇమేజ్కు తగ్గ సినిమా అందించాలి. ఇక ఇది ఏమీ చిన్నా చితకా చిత్రం కాదు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పెరిగిన తారక్ ఇమేజ్కు తగ్గట్లు పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న, భారీగా వీఎఫెక్స్తో ముడిపడ్డ సినిమా. ఈ సినిమాకేమో ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి పెట్టేశారు, షూటింగ్ ఏమో ఆలస్యంగా మొదలవుతోంది.
ఈ ఏడాది చివర్లోపే చిత్రీకరణ పూర్తి చేయాలి. పోస్ట్ ప్రొడక్షన్ పక్కాగా చేయాలి. వీఎఫెక్స్ లాంటివి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండాలి. ఈ సినిమాకు బడ్జెట్ పెడుతున్న వాళ్లేమో కొరటాల మిత్రుడు, తారక్ అన్నయ్య. అలాంటపుడు మరింత జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలి. ఇలా కొరటాల మీద మోయలేని భారమే ఉంది. దాన్ని మోస్తూ బ్లాక్బస్టర్ ఇవ్వడమంటే మామూలు సవాలు కాదు.దాన్ని ఆయనెలా ఛేదిస్తాడో చూడాలి
This post was last modified on March 23, 2023 8:24 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…