నిన్న విడుదలైన దాస్ కా ధమ్కీకి మొదటి రోజే 8 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టుగా జరుగుతున్న పబ్లిసిటీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విశ్వక్ సేన్ కి సాధారణంగా కనిపించే దానికన్నా మంచి ఓపెనింగ్ ఉన్నట్టు థియేటర్ల దగ్గర కనిపించినా మరీ భీభత్సమైన హౌస్ ఫుల్స్ తో అన్ని సెంటర్లలో టికెట్లు దొరకనంతగా అయితే కాదు. పైగా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అది వేరే సంగతి. ఉదయం షో నుంచే మిక్స్డ్ రియాక్షన్లు జనంలో కనిపించాయి. రివ్యూలు యావరేజ్ అన్నాయి. నెటిజెన్లు సెకండ్ హాఫ్ మీద కంప్లైంట్లు చేశారు. సో మొత్తానికి వసూళ్లు కొద్దిగా ఊగిసలాడాయి.
ఇప్పుడీ ఫిగర్లు చూస్తే విశ్వక్ సేన్ గత చిత్రాలకు ఇప్పుడీ దాస్ కా ధమ్కీకి పొంతన కనిపించడం లేదు. వెంకటేష్ లాంటి సీనియర్ హీరో స్పెషల్ క్యామియో చేసినా ఓరి దేవుడాకు ఫస్ట్ డే వచ్చింది 2 కోట్ల లోపే. అశోకవనంలో అర్జునకళ్యాణం కోటిన్నరకే పరిమితమయ్యింది. పాగల్ రెండున్నర, హిట్ ది ఫస్ట్ కేస్ మూడు కోట్ల ఇరవై లక్షలు, ఫలక్ నుమా దాస్ మూడు కోట్ల దాకా మొదటి రోజు గ్రాస్ నమోదు చేశాయి. వీటికి ఎక్కడా అందనంత దూరంలో ధమ్కీ ఏకంగా 8 కోట్లు రాబట్టడం అంటే గొప్పే. ఈ లెక్కన షేర్ మూడున్నర కోట్లు దాటేసింది. దాదాపు సగం బ్రేక్ ఈవెన్ అయిపోయింది.
ఎలాగూ వీకెండ్ లో ఇంకా మూడు రోజులు ఉన్నాయి. ఇదే జోరుని కొనసాగిస్తే హిట్టు మార్కు దాటేయొచ్చు. ధమాకాకు సైతం ఇదే తరహా టాక్ వచ్చినా వంద కోట్లు దాటేసింది కాబట్టి అదే రచయిత ప్రసన్నకుమార్ రాసిన ఈ దాస్ కా ధమ్కీ సైతం మెల్లగా ఊపందుకుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో నిజానిజాలెంతో సోమవారం వచ్చాకే క్లారిటీ వస్తుంది. ఎలాగూ బాక్సాఫీస్ వద్ద ఆప్షన్లు లేవు కాబట్టి ఆడియన్స్ మొదటి ప్రయారిటీలో విశ్వక్ సేన్ సినిమానే ఉంటోంది. మరి ఈ ఛాన్స్ కనక సరిగ్గా వాడుకుంటే పెట్టిన ఓవర్ బడ్జెట్ కి న్యాయం జరిగి లాభాలు వస్తాయి.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…