విజయ్ దేవరకొండ సమంతాల తొలి కలయికలో రూపొందుతున్న ఖుషి ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. సెప్టెంబర్ 1 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. గత ఏడాది సామ్ అనారోగ్యం పాలు కాకపోయి ఉంటే ఎప్పుడో డిసెంబర్ లోనే వచ్చేసేది. ఇటీవలే బ్యాలన్స్ షెడ్యూల్ మొదలుపెట్టిన దర్శకుడు శివ నిర్వాణ బ్రేకులు లేకుండా వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాడు.
ఏ కోణంలో చూసుకున్నా ఖుషి చాలా తెలివైన డేట్ ని పట్టేసింది. ఎందుకంటే ఆ రోజు చెప్పుకోదగ్గ టాలీవుడ్ సినిమాలేవీ లేవు. బాలీవుడ్ మూవీ ఆకాశమే నీ హద్దురా రీమేక్ ఒకటే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనివల్ల టాలీవుడ్ మీద పడే ప్రభావం సున్నా కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీనికి రెండు వారాల ముందు కూడా నోటెడ్ రిలీజులు ప్లాన్ చేయలేదు. ఆగస్ట్ లోనే భోళా శంకర్, జైలర్, యానిమల్ లాంటి పెద్ద మూవీస్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఖుషికి ఫ్రీ గ్రౌండ్ దొరికేస్తుంది. ఇప్పటికైతే టెన్షన్ లేదు కానీ ఎవరైనా చివరి నిమిషంలో ట్విస్టు ఇస్తే తప్ప.
గత ఏడాది ఆగస్ట్ లో లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఈ ఖుషి బోలెడు నమ్మకంతో ఉన్నాడు. సున్నితమైన ప్రేమకథలు చెప్పడంలో మంచి నేర్పరి అయిన శివ నిర్వాణ ఈ ఖుషిని అదే తరహాలో తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. మల్లువుడ్ సెన్సేషన్ హీశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇది తనకిక్కడ డెబ్యూ మూవీ. ఖుషి మ్యూజిక్ గురించి ఫీడ్ బ్యాక్ విన్నాకే నాని 30కి ఛాన్స్ ఇచ్చారనే టాక్ ఉంది. ఇక సమంతాకు యశోద ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా యూత్ హీరోల జోడిగా తాను ఇప్పటికీ పర్ఫెక్ట్ ఛాయ్సని నిరూపించుకోవడానికి ఖుషి విజయం కీలకం.
This post was last modified on March 23, 2023 5:48 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…
ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…
రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…