నిన్ననే ‘భీష్మ’ తర్వాత నితిన్, రష్మిక మందన్నా, వెంకీ కుడుముల కాంబినేషన్లో కొత్త సినిమా అనౌన్స్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ వీడియో వదిలింది చిత్ర బృందం. అందులో నితిన్, రష్మిక వాళ్ల మీద వాళ్లే కొన్ని కౌంటర్లు వేసుకోవడం భలే సరదాగా అనిపించింది. రష్మిక తాను ఒక్క మాట మాట్లాడితే రెండు మూడు కాంట్రవర్శీలు అవుతున్నాయంటూ ఒక కామెంట్ చేయడం విశేషం. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు.
ఆమె ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చిందంటే అందులో తను మాట్లాడిన ఏదో ఒక పాయింట్ మీద వివాదం చెలరేగడం కామనే. గత ఏడాది ఇలాగే ఒక ఇంటర్వ్యూ తీవ్ర వివాదాస్పదం అయింది. తన తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’లో అవకాశం రావడం గురించి చెబుతూ.. ఆ నిర్మాణ సంస్థ పేరెత్తడానికి.. అలాగే దర్శక నిర్మాతలు రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిల గురించి మాట్టాడ్డానికి రష్మిక ఇష్టపడలేదు. అంతే కాక రిషబ్ కొత్త చిత్రం ‘కాంతార’ చూడలేదని అనడం మీదా వివాదం రాజేశారు.
తర్వాత ఓ ఇంటర్వ్యూలో తానేం ఏం చేసినా తప్పంటే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రష్మిక. అప్పుడు అలా కవర్ చేసినప్పటికీ.. ఇప్పుడు మాత్రం ఆ తప్పును దిద్దుకుంది రష్మిక. తాజాగా ఇంకో ఇంటర్వ్యూలో తన తొలి సినిమా గురించి మాట్లాడుతూ.. రక్షిత్ శెట్టితో పాటు అతడి నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ పేరు కూడా చెప్పింది. “నేను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అలా అసలు ఊహించుకోలేదు కూడా. కానీ సినిమా అంటే చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం. కొన్ని సినిమాల ఆడిషన్స్కు కూడా వెళ్లా. కానీ నిరాశ తప్పలేదు. నటన అనేది నాకు రాసి పెట్టి లేదని అనుకునేదాన్ని. అలాంటి టైంలో నేనొక అందాల పోటీలో పాల్గొని టైటిల్ గెలిచా. దానికి సంబంధించిన ఫొటోల్ని పేపర్లో చూసి రక్షిత్ శెట్టి సంస్థ పరంవా స్టూడియోస్ నుంచి కాల్ వచ్చింది. తాము తీస్తున్న ‘కిరిక్ పార్టీ’లో దర్శక నిర్మాతలు నాకు రోల్ ఆఫర్ చేశారు. అలా నటిగా నా తొలి అడుగు పడింది” అని రష్మిక వివరించింది.
This post was last modified on March 23, 2023 12:47 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…