దగ్గుబాటి రానా , అక్కినేని నాగ చైతన్య ఇద్దరు కలిసి ప్రొడక్షన్ హౌజ్ పెట్టారు. ఎవరికీ తెలియకుండా ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసేశారు. అయితే ఈ ఇద్దరు కలిసింది సినిమా కోసం కాదు. వెబ్ సిరీస్ కోసం. తాజాగా ఓ కొత్త బేనర్ స్టార్ట్ చేసి మాయాబజార్ అనే వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తయిన ఈ షో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. వీరిద్దరూ కలిసి ఏ ఓటీటీ కి చేస్తున్నారు అనే డీటైల్స్ బయటికి రాలేదు కానీ తాజాగా ఓ సంస్థతో ఒప్పందం కూడా అయిపోయిందని సమాచారం.
అయితే ఈ సిరీస్ లో రానా , చైతు కనిపించరు, వీరిద్దరూ కేవలం కంటెంట్ కి ప్రొడ్యూసర్స్ మాత్రమే. రానా ఇప్పటికే వెబ్ సిరీస్ లతో ఓటీటీ లోకి దిగాడు. చైతు కూడా ధూత అనే సిరీస్ చేశాడు అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. రానా ఇప్పటికే రెండు మూడు సినిమాలకు సమర్పకుడిగా కూడా వ్యవహరించాడు. చైతు నిర్మాతగా ఇదే మొదటి ప్రాజెక్ట్.
త్వరలోనే దగ్గుబాటి హీరో , అక్కినేని హీరో ఇద్దరు తమ ప్రొడక్ట్ ‘మాయాబజార్ ‘ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి నిర్మాతలుగా ప్రమోషన్స్ తో రంగంలోకి దిగబోతున్నారు. ఈ షో గురించి మరిన్ని డీటైల్స్ త్వరలోనే బయటికి రానున్నాయి.
This post was last modified on March 22, 2023 3:51 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…