దగ్గుబాటి రానా , అక్కినేని నాగ చైతన్య ఇద్దరు కలిసి ప్రొడక్షన్ హౌజ్ పెట్టారు. ఎవరికీ తెలియకుండా ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసేశారు. అయితే ఈ ఇద్దరు కలిసింది సినిమా కోసం కాదు. వెబ్ సిరీస్ కోసం. తాజాగా ఓ కొత్త బేనర్ స్టార్ట్ చేసి మాయాబజార్ అనే వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తయిన ఈ షో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. వీరిద్దరూ కలిసి ఏ ఓటీటీ కి చేస్తున్నారు అనే డీటైల్స్ బయటికి రాలేదు కానీ తాజాగా ఓ సంస్థతో ఒప్పందం కూడా అయిపోయిందని సమాచారం.
అయితే ఈ సిరీస్ లో రానా , చైతు కనిపించరు, వీరిద్దరూ కేవలం కంటెంట్ కి ప్రొడ్యూసర్స్ మాత్రమే. రానా ఇప్పటికే వెబ్ సిరీస్ లతో ఓటీటీ లోకి దిగాడు. చైతు కూడా ధూత అనే సిరీస్ చేశాడు అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. రానా ఇప్పటికే రెండు మూడు సినిమాలకు సమర్పకుడిగా కూడా వ్యవహరించాడు. చైతు నిర్మాతగా ఇదే మొదటి ప్రాజెక్ట్.
త్వరలోనే దగ్గుబాటి హీరో , అక్కినేని హీరో ఇద్దరు తమ ప్రొడక్ట్ ‘మాయాబజార్ ‘ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి నిర్మాతలుగా ప్రమోషన్స్ తో రంగంలోకి దిగబోతున్నారు. ఈ షో గురించి మరిన్ని డీటైల్స్ త్వరలోనే బయటికి రానున్నాయి.
This post was last modified on March 22, 2023 3:51 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…