దగ్గుబాటి రానా , అక్కినేని నాగ చైతన్య ఇద్దరు కలిసి ప్రొడక్షన్ హౌజ్ పెట్టారు. ఎవరికీ తెలియకుండా ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసేశారు. అయితే ఈ ఇద్దరు కలిసింది సినిమా కోసం కాదు. వెబ్ సిరీస్ కోసం. తాజాగా ఓ కొత్త బేనర్ స్టార్ట్ చేసి మాయాబజార్ అనే వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తయిన ఈ షో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. వీరిద్దరూ కలిసి ఏ ఓటీటీ కి చేస్తున్నారు అనే డీటైల్స్ బయటికి రాలేదు కానీ తాజాగా ఓ సంస్థతో ఒప్పందం కూడా అయిపోయిందని సమాచారం.
అయితే ఈ సిరీస్ లో రానా , చైతు కనిపించరు, వీరిద్దరూ కేవలం కంటెంట్ కి ప్రొడ్యూసర్స్ మాత్రమే. రానా ఇప్పటికే వెబ్ సిరీస్ లతో ఓటీటీ లోకి దిగాడు. చైతు కూడా ధూత అనే సిరీస్ చేశాడు అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. రానా ఇప్పటికే రెండు మూడు సినిమాలకు సమర్పకుడిగా కూడా వ్యవహరించాడు. చైతు నిర్మాతగా ఇదే మొదటి ప్రాజెక్ట్.
త్వరలోనే దగ్గుబాటి హీరో , అక్కినేని హీరో ఇద్దరు తమ ప్రొడక్ట్ ‘మాయాబజార్ ‘ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి నిర్మాతలుగా ప్రమోషన్స్ తో రంగంలోకి దిగబోతున్నారు. ఈ షో గురించి మరిన్ని డీటైల్స్ త్వరలోనే బయటికి రానున్నాయి.
This post was last modified on March 22, 2023 3:51 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…