సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఉగాది ముంగిట నిరాశాజనకమైన మూడ్లో ఉన్నారు. ఈ పండక్కి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ వస్తాయని కాస్త ప్రచారం జరగడంతో అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ తీరా చూస్తే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ఇంకో రెండు నెలలకు మహేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయాలని చిత్ర బృందం ఫిక్సయినట్లు తెలుస్తోంది.
కృష్ణ మరణానంతరం వస్తున్న తొలి పుట్టిన రోజు కావడంతో ఆ రోజును ప్రత్యేకంగా మార్చాలని మహేష్ భావిస్తున్నట్లున్నాడు. కుదిరితే టీజర్ కూడా ఆ రోజు వదిలే అవకాశాలు లేకపోలేదు. మహేష్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి తొలి విశేషాలను తన తండ్రి జయంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని మహేష్ భావించడాన్ని అభిమానులు కూడా స్వాగతించాల్సిందే.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ విషయంలోనూ అభిమానులు సందిగ్ధంలో ఉన్నారు. ముందు ఏప్రిల్ 28కి అనుకున్న ఈ చిత్రాన్ని.. ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ప్రేక్షకుల ముందుకు తెస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొత్త డేట్ గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కట్ చేస్తే.. ఇప్పుడేమో మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా ‘భోళా శంకర్’ను ఆగస్టు 11కు ఖాయం చేసుకున్నారు.
తమ హీరో సినిమా ఉండగా.. చిరు పోటీకి వచ్చాడేంటి అనుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. కానీ వాస్తవం ఏంటంటే.. ఆగస్టు రేసు నుంచి మహేష్ సినిమా ఎప్పుడో తప్పుకుంది. షూటింగ్ అనుకున్నదాని కంటే చాలా లేటుగా మొదలవడంతో ఈ సినిమా దసరాకైనా వస్తుందా అన్నది డౌటే. వచ్చే ఏడాది సంక్రాంతికి రావచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి.
This post was last modified on March 22, 2023 12:32 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…