సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఉగాది ముంగిట నిరాశాజనకమైన మూడ్లో ఉన్నారు. ఈ పండక్కి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ వస్తాయని కాస్త ప్రచారం జరగడంతో అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ తీరా చూస్తే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ఇంకో రెండు నెలలకు మహేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయాలని చిత్ర బృందం ఫిక్సయినట్లు తెలుస్తోంది.
కృష్ణ మరణానంతరం వస్తున్న తొలి పుట్టిన రోజు కావడంతో ఆ రోజును ప్రత్యేకంగా మార్చాలని మహేష్ భావిస్తున్నట్లున్నాడు. కుదిరితే టీజర్ కూడా ఆ రోజు వదిలే అవకాశాలు లేకపోలేదు. మహేష్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి తొలి విశేషాలను తన తండ్రి జయంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని మహేష్ భావించడాన్ని అభిమానులు కూడా స్వాగతించాల్సిందే.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ విషయంలోనూ అభిమానులు సందిగ్ధంలో ఉన్నారు. ముందు ఏప్రిల్ 28కి అనుకున్న ఈ చిత్రాన్ని.. ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ప్రేక్షకుల ముందుకు తెస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొత్త డేట్ గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కట్ చేస్తే.. ఇప్పుడేమో మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా ‘భోళా శంకర్’ను ఆగస్టు 11కు ఖాయం చేసుకున్నారు.
తమ హీరో సినిమా ఉండగా.. చిరు పోటీకి వచ్చాడేంటి అనుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. కానీ వాస్తవం ఏంటంటే.. ఆగస్టు రేసు నుంచి మహేష్ సినిమా ఎప్పుడో తప్పుకుంది. షూటింగ్ అనుకున్నదాని కంటే చాలా లేటుగా మొదలవడంతో ఈ సినిమా దసరాకైనా వస్తుందా అన్నది డౌటే. వచ్చే ఏడాది సంక్రాంతికి రావచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి.
This post was last modified on March 22, 2023 12:32 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…