టాలీవుడ్ కొత్త రిలీజ్ల కోసం వీకెండ్ వరకు ఆగాల్సిన అవసరం లేకపోయింది. వారం మధ్యలోనే ఉగాది సెలవు రావడంతో అదే రోజు రెండు కొత్త చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. అవి రెండూ ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి రేకెత్తిస్తున్నవే. క్రేజ్ పరంగా చూస్తే యువ కథానాయకుడు విశ్వక్సేన్ తనే లీడ్ రోల్ చేస్తూ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో రూపొందించిన ‘దాస్ కా ధమ్కీ’ ముందంజలో ఉంది.
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి పెర్ఫామర్గా గుర్తింపు సంపాదించిన విశ్వక్.. ‘ఫలక్నుమా దాస్’తో దర్శకుడిగా కూడా ప్రతిభను చాటుకున్నాడు. ఐతే అది రీమేక్ మూవీ. ఈసారి అతను స్ట్రెయిట్ మూవీతో మెగా ఫోన్ పట్టాడు. ఈ సినిమా ఆరంభం నుంచి యూత్లో మంచి క్రేజే తెచ్చుకుంది. ట్రైలర్లు చూస్తే మాస్ అంశాలకు లోటు లేని పక్కా కమర్షియల్ మూవీలా కనిపిస్తోంది. విశ్వక్ సినిమాలో అదరగొట్టినట్లే కనిపిస్తున్నాడు. నివేథా పెతురాజ్ గ్లామర్ కూడా సినిమాకు ఎసెట్ అయ్యేలా ఉంది.
ఇక ఉగాది బరిలో ఉన్న మరో సినిమా ‘రంగమార్తాండ’. ఒకప్పుడు వరుసబెట్టి క్లాసిక్స్ అందించిన సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ నుంచి వస్తున్న చిత్రమిది. చాలా ఏళ్లుగా సరైన విజయం లేని ఈ క్రియేటివ్ జీనియస్.. ఈసారి చాలా ఇష్టపడి, కష్టపడి మరాఠీ మూవీ ‘నటసామ్రాట్’ను రీమేక్ చేశాడు. ఎన్నో అవాంతరాలను దాటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ప్రోమోలు చూస్తే ఇది ఎమోషన్లు, సెంటిమెంట్తో ముడిపడ్డ గాఢమైన సినిమాలా కనిపిస్తోంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఆడటం ఈజీ కాదు కానీ.. విడుదల ముంగిట స్పెషల్ ప్రివ్యూల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్.. అభిరుచి ఉన్న ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఈ రెండు కొత్త చిత్రాల్లో ఏది ఎంతమేర మెప్పిస్తుందో.. వేసవి సీజన్కు ఇవి ఎలాంటి ఆరంభాన్నిస్తాయో చూడాలి.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…