టాలీవుడ్ కొత్త రిలీజ్ల కోసం వీకెండ్ వరకు ఆగాల్సిన అవసరం లేకపోయింది. వారం మధ్యలోనే ఉగాది సెలవు రావడంతో అదే రోజు రెండు కొత్త చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. అవి రెండూ ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి రేకెత్తిస్తున్నవే. క్రేజ్ పరంగా చూస్తే యువ కథానాయకుడు విశ్వక్సేన్ తనే లీడ్ రోల్ చేస్తూ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో రూపొందించిన ‘దాస్ కా ధమ్కీ’ ముందంజలో ఉంది.
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి పెర్ఫామర్గా గుర్తింపు సంపాదించిన విశ్వక్.. ‘ఫలక్నుమా దాస్’తో దర్శకుడిగా కూడా ప్రతిభను చాటుకున్నాడు. ఐతే అది రీమేక్ మూవీ. ఈసారి అతను స్ట్రెయిట్ మూవీతో మెగా ఫోన్ పట్టాడు. ఈ సినిమా ఆరంభం నుంచి యూత్లో మంచి క్రేజే తెచ్చుకుంది. ట్రైలర్లు చూస్తే మాస్ అంశాలకు లోటు లేని పక్కా కమర్షియల్ మూవీలా కనిపిస్తోంది. విశ్వక్ సినిమాలో అదరగొట్టినట్లే కనిపిస్తున్నాడు. నివేథా పెతురాజ్ గ్లామర్ కూడా సినిమాకు ఎసెట్ అయ్యేలా ఉంది.
ఇక ఉగాది బరిలో ఉన్న మరో సినిమా ‘రంగమార్తాండ’. ఒకప్పుడు వరుసబెట్టి క్లాసిక్స్ అందించిన సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ నుంచి వస్తున్న చిత్రమిది. చాలా ఏళ్లుగా సరైన విజయం లేని ఈ క్రియేటివ్ జీనియస్.. ఈసారి చాలా ఇష్టపడి, కష్టపడి మరాఠీ మూవీ ‘నటసామ్రాట్’ను రీమేక్ చేశాడు. ఎన్నో అవాంతరాలను దాటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ప్రోమోలు చూస్తే ఇది ఎమోషన్లు, సెంటిమెంట్తో ముడిపడ్డ గాఢమైన సినిమాలా కనిపిస్తోంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఆడటం ఈజీ కాదు కానీ.. విడుదల ముంగిట స్పెషల్ ప్రివ్యూల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్.. అభిరుచి ఉన్న ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఈ రెండు కొత్త చిత్రాల్లో ఏది ఎంతమేర మెప్పిస్తుందో.. వేసవి సీజన్కు ఇవి ఎలాంటి ఆరంభాన్నిస్తాయో చూడాలి.
This post was last modified on March 22, 2023 10:34 am
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…