విశ్వక్సేన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే చాలామందికి కామెడీగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే తమ సినిమాలకు హైప్ తేవడం కోసం వివాదాస్పద కామెంట్లు చేయడం, కాంట్రవర్శీలు క్రియేట్ చేయడం ఒక ట్రెండుగా మారిన ఈ రోజుల్లో.. విశ్వక్ తీరు ఆ తరహాలోనే కనిపిస్తుంటుంది. స్టేజ్ మీద అతను మాట్లాడే మాటలు, ఇచ్చే స్టేట్మెంట్లు అతిగా ఉంటాయి.
ఇక ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రిలీజ్ ముంగిట రోడ్డు మీద చేసిన ఒక ప్రాంక్ వీడియో.. దాని మీద ఒక టీవీ ఛానెల్ స్టూడియోలో జరిగిన చర్చా కార్యక్రమంలో జరిగిన రభస ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఆ టైంలో విశ్వక్ మీద విమర్శలు కూడా వచ్చాయి. కావాలని కాంట్రవర్శీలు క్రియేట్ చేసి పబ్లిసిటీ పొందాలని చూస్తాడన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఐతే ఇప్పుడు విశ్వక్ తన శైలికి పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నాడు.
‘‘కావాలని కాంట్రవర్శీలు క్రియేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరైనా ఏదైనా అంటే నేను ఊరుకోకుండా సమాధానం ఇవ్వడం వల్లే వివాదాలు వస్తున్నాయి. ఎక్కడైనా ఒక్కడే ఉన్న చోట రాళ్లు వేస్తారు. పది మంది ఉన్న చోట వేయరు. నేను ఏం జరిగినా మనకెందుకులే అనుకోకుండా సమాధానం ఇస్తా కాబట్టే వివాదాలు రాజేస్తున్నారు. నేనైతే కాంట్రవర్శీలు క్రియేట్ చేయాలనుకోను. కాంట్రవర్శీ వల్లే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రానికి మార్నింగ్ షోలన్నీ హౌస్ ఫుల్ కాలేదు. మార్నింగ్ షోలకు మంచి టాక్ వచ్చాక మ్యాట్నీలకు వసూళ్లు పెరిగాయి. తర్వాత ఎక్కువమంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు’’ అని విశ్వక్ తెలిపాడు.
తన కొత్త సినిమా ‘దాస్ కా ధమ్కీ’ విడుదల నేపథ్యంలో మీడియాను కలిసిన సందర్భంగా విశ్వక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విశ్వక్ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది కానుకగా బుధవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
This post was last modified on March 22, 2023 8:43 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…