Movie News

మహేష్ 28 కథలోకి భోళాశంకర్ వచ్చాడు

ఇదేదో వాల్తేరు వీరయ్య సినిమాలో డైలాగులా అనిపిస్తోంది కదూ. అవును కొన్నిసార్లు తెరమీద సంభాషణలు నిజ జీవితంలోనూ అన్వయించుకోవాల్సి ఉంటుంది. మహేష్ బాబు 28 ఖచ్చితంగా ఆగస్ట్ 11న విడుదల చేస్తామని నిర్మాత నాగ వంశీ బుట్టబొమ్మ ప్రమోషన్స్ టైంలోనే చాలా స్పష్టంగా చెప్పిన సంగతి అభిమానులు ఇంకా మర్చిపోలేదు. అయినా కూడా నిజంగానే ఆ తేదీని అందుకోగలరా లేదానే దాని మీద అనుమానాలు లేకపోలేదు. కట్ చేస్తే ఫ్యాన్స్ భయపడినంతా అయ్యింది. మహేష్ మూవీ వెనుకడుగు వేయడం దాదాపు లాంఛనమే అనుకోవాలి.

ఉగాది పండగ సందర్భంగా కాస్త అడ్వాన్స్ గా భోళా శంకర్ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 11కి థియేటర్లకు వచ్చేస్తుందని తమన్నా కీర్తి సురేష్ లతో కలిసున్న చిరు కొత్త పోస్టర్ ఒకటి వదిలారు. అంటే మహేష్ 28 డ్రాప్ అయినట్టే. 2024 సంక్రాంతికి షిఫ్ట్ చేశారని గత వారం రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నా ఫైనల్ గా ఇప్పుడు కన్ఫర్మేషన్ దొరికింది. అయితే చిరుకి సోలో అడ్వాంటేజ్ ఏమి దొరకలేదు. రజనీకాంత్ జైలర్ ఆ తేదీకే దింపాలని సన్ పిక్చర్స్ ప్లానింగ్ లో ఉంది. రణబీర్ కపూర్ సందీప్ వంగా యానిమల్ ఎప్పుడో లాక్ చేసుకుంది

సో భోళాశంకర్ కు పరిస్థితులు మరీ అంత అనుకూలంగా అయితే ఉండవు. తాజాగా వదిలిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతోంది. ఏదో షాపింగ్ మాల్ ప్రకటనలా డిజైన్ చేశారని, మాస్ సినిమాకు ఇదేం ప్రమోషనని సెటైర్లు వేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తమిళ హిట్ వేదాళం రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇది మొదలైనప్పటి నుంచి అభిమానుల్లో ఎన్నో అనుమానాలున్నాయి. మెగాస్టార్ మాత్రం ధీమాగా ఉన్నారు. వీరయ్య ఇచ్చిన సక్సెస్ కిక్ ని ఇది కొనసాగిస్తుందనే నమ్మకంతో ఉన్నారు

This post was last modified on March 21, 2023 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

25 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

1 hour ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

1 hour ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago