రీఎంట్రీ తర్వాత కొన్నేళ్లు నెమ్మదిగాన కనిపించాడు మెగాస్టార్ చిరంజీవి. కానీ తర్వాత స్పీడు పెంచారు.2022 వేసవితో మొదలుపెట్టి 10 నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ చేశాడు మెగాస్టార్. వీటిలో ఆచార్య నిరాశపరిచినా.. గాడ్ ఫాదర్ ఓ మోస్తరుగా ఆడింది. వాల్తేరు వీరయ్య బ్లాక్బస్టర్ అయింది. ఈ ఊపులో తన కొత్త సినిమా మీద దృష్టిపెట్టారు చిరు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు చేస్తున్న భోళా శంకర్ ఏప్రిల్లోనే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇప్పుడీ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఇండిపెండెన్స్ డే వీకెండ్కు సినిమాను షెడ్యూల్ చేశారు. ఆగస్టు 11న సినిమాను విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.
ఉగాది పండుగను పురస్కరించుకుని కొత్త రిలీజ్ డేట్తో పోస్టర్ రిలీజ్ చేసింది భోళా శంకర్ టీం. ఇందులో చిరుతో పాటు సినిమాలో ఆయన చెల్లెలిగా కీలక పాత్ర చేస్తున్న కీర్తి సురేష్, కథానాయిక తమన్నాలతో కలిసి తెలుగుదనం, పండుగ కళ ఉట్టిపడేలా కనిపించాడు చిరు. ఈ చిత్రం తమిళ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
తమిళంలో అజిత్ హీరోగా నటించిన ఈ మాస్ మసాలా సినిమాను చిరు రీమేక్ చేయడం, అందులోనూ చాలా ఏళ్లుగా లైమ్ లైట్లో లేని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయడంపై మెగా అభిమానుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ చిరు అవేమీ పట్టించుకోకుండా సినిమా చేసేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని చిరుకు సన్నిహితుడైన సీనియర్ నిర్మాత కేఎస్ రామారావుతో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అతను చేస్తున్న తొలి పెద్ద సినిమా ఇదే.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…
ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…
రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…