రీఎంట్రీ తర్వాత కొన్నేళ్లు నెమ్మదిగాన కనిపించాడు మెగాస్టార్ చిరంజీవి. కానీ తర్వాత స్పీడు పెంచారు.2022 వేసవితో మొదలుపెట్టి 10 నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ చేశాడు మెగాస్టార్. వీటిలో ఆచార్య నిరాశపరిచినా.. గాడ్ ఫాదర్ ఓ మోస్తరుగా ఆడింది. వాల్తేరు వీరయ్య బ్లాక్బస్టర్ అయింది. ఈ ఊపులో తన కొత్త సినిమా మీద దృష్టిపెట్టారు చిరు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు చేస్తున్న భోళా శంకర్ ఏప్రిల్లోనే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇప్పుడీ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఇండిపెండెన్స్ డే వీకెండ్కు సినిమాను షెడ్యూల్ చేశారు. ఆగస్టు 11న సినిమాను విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.
ఉగాది పండుగను పురస్కరించుకుని కొత్త రిలీజ్ డేట్తో పోస్టర్ రిలీజ్ చేసింది భోళా శంకర్ టీం. ఇందులో చిరుతో పాటు సినిమాలో ఆయన చెల్లెలిగా కీలక పాత్ర చేస్తున్న కీర్తి సురేష్, కథానాయిక తమన్నాలతో కలిసి తెలుగుదనం, పండుగ కళ ఉట్టిపడేలా కనిపించాడు చిరు. ఈ చిత్రం తమిళ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
తమిళంలో అజిత్ హీరోగా నటించిన ఈ మాస్ మసాలా సినిమాను చిరు రీమేక్ చేయడం, అందులోనూ చాలా ఏళ్లుగా లైమ్ లైట్లో లేని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయడంపై మెగా అభిమానుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ చిరు అవేమీ పట్టించుకోకుండా సినిమా చేసేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని చిరుకు సన్నిహితుడైన సీనియర్ నిర్మాత కేఎస్ రామారావుతో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అతను చేస్తున్న తొలి పెద్ద సినిమా ఇదే.
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…