రీఎంట్రీ తర్వాత కొన్నేళ్లు నెమ్మదిగాన కనిపించాడు మెగాస్టార్ చిరంజీవి. కానీ తర్వాత స్పీడు పెంచారు.2022 వేసవితో మొదలుపెట్టి 10 నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ చేశాడు మెగాస్టార్. వీటిలో ఆచార్య నిరాశపరిచినా.. గాడ్ ఫాదర్ ఓ మోస్తరుగా ఆడింది. వాల్తేరు వీరయ్య బ్లాక్బస్టర్ అయింది. ఈ ఊపులో తన కొత్త సినిమా మీద దృష్టిపెట్టారు చిరు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు చేస్తున్న భోళా శంకర్ ఏప్రిల్లోనే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇప్పుడీ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఇండిపెండెన్స్ డే వీకెండ్కు సినిమాను షెడ్యూల్ చేశారు. ఆగస్టు 11న సినిమాను విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.
ఉగాది పండుగను పురస్కరించుకుని కొత్త రిలీజ్ డేట్తో పోస్టర్ రిలీజ్ చేసింది భోళా శంకర్ టీం. ఇందులో చిరుతో పాటు సినిమాలో ఆయన చెల్లెలిగా కీలక పాత్ర చేస్తున్న కీర్తి సురేష్, కథానాయిక తమన్నాలతో కలిసి తెలుగుదనం, పండుగ కళ ఉట్టిపడేలా కనిపించాడు చిరు. ఈ చిత్రం తమిళ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
తమిళంలో అజిత్ హీరోగా నటించిన ఈ మాస్ మసాలా సినిమాను చిరు రీమేక్ చేయడం, అందులోనూ చాలా ఏళ్లుగా లైమ్ లైట్లో లేని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయడంపై మెగా అభిమానుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ చిరు అవేమీ పట్టించుకోకుండా సినిమా చేసేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని చిరుకు సన్నిహితుడైన సీనియర్ నిర్మాత కేఎస్ రామారావుతో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అతను చేస్తున్న తొలి పెద్ద సినిమా ఇదే.
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…