ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రంగమార్తాండ సినిమా. ఒకప్పుడు వరుసబెట్టి క్లాసిక్స్ అందించి, చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. మేకింగ్ దశలోనే ఈ సినిమా చాలా ఆలస్యం అయింది. ఆ తర్వాత సినిమాకు బిజినెస్ జరగక మరింత ఆలస్యం తప్పలేదు.
ఐతే అన్ని అడ్డంకులనూ అధిగమించి ఉగాది రోజు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు బజ్ పెంచడం కోసం ఫిలిం సెలబ్రెటీలతో పాటు మీడియా వాళ్లకు వరుసబెట్టి ప్రిమియర్స్ వేశారు. చూసిన వాళ్లందరూ సినిమాను మెచ్చుకున్నారు. అయినా సరే సినిమాకు ఇంకా బజ్ అవసరమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఏమాత్రం థియేటర్లకు వస్తారో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
రిలీజ్ ముంగిట సినిమాకు బజ్ పెంచే దిశగా ప్రమోషన్లు కొంచెం గట్టిగా చేయాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ రెగ్యులర్గా సినిమాలకు చేసినట్లు ఈ చిత్రానికి ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేదు. చిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టారు. అందులో కృష్ణవంశీ కాకుండా పేరున్న వ్యక్తి ఎవరూ లేరు.
సినిమాలో లీడ్ రోల్ చేసిన ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్లో పాల్గొనలేదు. అంతే కాక రంగమార్తాండ గురించి ఆయన మీడియా వాళ్లను కలిసి ఇంటర్వ్యూలు కూడా ఏమీ ఇవ్వడం లేదు. కృష్ణవంశీతో వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్కు మంచి స్నేహం ఉంది.
కానీ తన ప్రమోషన్ అవసరమైన స్థితిలో ఈ విలక్షణ నటుడు హ్యాండ్ ఇచ్చేశాడు. ప్రకాష్ రాజ్కు జోడీగా నటించిన రమ్యకృష్ణ, సినిమాలో తన ఇమేజ్కు భిన్నమైన పాత్ర చేసిన బ్రహ్మానందం సైతం ప్రమోషన్లకు దూరంగానే ఉండటం రంగమార్తాండకు మైనస్ అవుతోంది.
This post was last modified on March 21, 2023 12:39 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…