దక్షిణాద సినిమాల్లో ఒకప్పుడు సీక్వెల్స్ ఏమాత్రం కలిసొచ్చేవి కావు. కానీ బాహుబలి, కేజీఎఫ్, పుష్ప సినిమాలతో కథ మారిపోయింది. నిజానికి ఇవి నిఖార్సయిన సీక్వెల్స్ కావు. ఒక సినిమాగా మొదలుపెట్టి.. ఆ తర్వాత రెండు భాగాలుగా మారాయి. బాహుబలి, కేజీఎఫ్ రెండో భాగాలు అసాధారణ విజయాన్నందుకోవడంతో చాలామందిలో ఇలాంటి ఆలోచనే కలిగింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈ వ్యవహారం మారింది. కానీ తొలి సినిమా హిట్ అయితే రెండో చిత్రానికి మంచి క్రేజ్ వస్తుంది కానీ.. రిజల్ట్ తేడా కొడితే మాత్రం కష్టమే.
యన్.టి.ఆర్-కథానాయకుడుకు కొనసాగింపుగా వచ్చిన మహానాయుడు సినిమా పరిస్థఙతి ఎంత దారుణంగా తయారైందో తెలిసిందే. దానికి మినిమం బజ్ లేకపోయింది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా పరిస్థతి ఇలాగే తయారయ్యేలా ఉంది.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కేజీఎఫ్ను చూసి.. అచ్చం అలాంటి సినిమానే తీసింది కబ్జ టీం. కానీ ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్పేలా లేదు. కన్నడేతర భాషల్లో ఈ చిత్రం తొలి రోజే వాషౌట్ అయిపోయింది. కన్నడలో కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. అక్కడి ప్రేక్షకులు కూడా సినిమాను తిరస్కరించారు. వీకెండ్ వరకు ఓ మోస్తరుగా ఆడిన కబ్జ.. ఆ తర్వాత చతికిలపడింది. మొత్తంగా సినిమా పెద్ద డిజాస్టర్ అనడంలో సందేహం లేదు. కానీ కబ్జ సినిమాను ముందే రెండు భాగాలుగా ప్లాన్ చేశారు.
ఫస్ట్ పార్ట్లో క్యామియో తరహా రోల్స్లో కనిపించిన శివరాజ్ కుమార్, కిచ్చా సుదీప్లకు రెండో భాగంలో ఫుల్ రోల్స్ సెట్ చేశాడు దర్శక నిర్మాత చంద్రు. కానీ ప్రేక్షకుల్లో అయితే రెండో భాగం చూసేందుకు కనీస ఆసక్తి లేదు. తొలి భాగానికే తల బొప్పి కట్టిపోయిన నేపథ్యంలో ఇక సెకండ్ పార్ట్ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.
This post was last modified on March 20, 2023 10:58 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…