దక్షిణాద సినిమాల్లో ఒకప్పుడు సీక్వెల్స్ ఏమాత్రం కలిసొచ్చేవి కావు. కానీ బాహుబలి, కేజీఎఫ్, పుష్ప సినిమాలతో కథ మారిపోయింది. నిజానికి ఇవి నిఖార్సయిన సీక్వెల్స్ కావు. ఒక సినిమాగా మొదలుపెట్టి.. ఆ తర్వాత రెండు భాగాలుగా మారాయి. బాహుబలి, కేజీఎఫ్ రెండో భాగాలు అసాధారణ విజయాన్నందుకోవడంతో చాలామందిలో ఇలాంటి ఆలోచనే కలిగింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈ వ్యవహారం మారింది. కానీ తొలి సినిమా హిట్ అయితే రెండో చిత్రానికి మంచి క్రేజ్ వస్తుంది కానీ.. రిజల్ట్ తేడా కొడితే మాత్రం కష్టమే.
యన్.టి.ఆర్-కథానాయకుడుకు కొనసాగింపుగా వచ్చిన మహానాయుడు సినిమా పరిస్థఙతి ఎంత దారుణంగా తయారైందో తెలిసిందే. దానికి మినిమం బజ్ లేకపోయింది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా పరిస్థతి ఇలాగే తయారయ్యేలా ఉంది.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కేజీఎఫ్ను చూసి.. అచ్చం అలాంటి సినిమానే తీసింది కబ్జ టీం. కానీ ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్పేలా లేదు. కన్నడేతర భాషల్లో ఈ చిత్రం తొలి రోజే వాషౌట్ అయిపోయింది. కన్నడలో కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. అక్కడి ప్రేక్షకులు కూడా సినిమాను తిరస్కరించారు. వీకెండ్ వరకు ఓ మోస్తరుగా ఆడిన కబ్జ.. ఆ తర్వాత చతికిలపడింది. మొత్తంగా సినిమా పెద్ద డిజాస్టర్ అనడంలో సందేహం లేదు. కానీ కబ్జ సినిమాను ముందే రెండు భాగాలుగా ప్లాన్ చేశారు.
ఫస్ట్ పార్ట్లో క్యామియో తరహా రోల్స్లో కనిపించిన శివరాజ్ కుమార్, కిచ్చా సుదీప్లకు రెండో భాగంలో ఫుల్ రోల్స్ సెట్ చేశాడు దర్శక నిర్మాత చంద్రు. కానీ ప్రేక్షకుల్లో అయితే రెండో భాగం చూసేందుకు కనీస ఆసక్తి లేదు. తొలి భాగానికే తల బొప్పి కట్టిపోయిన నేపథ్యంలో ఇక సెకండ్ పార్ట్ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.
This post was last modified on March 20, 2023 10:58 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…