సోషల్ మీడియాలో ఉండే స్టార్ హీరోల అభిమానులు సైలెంట్గా ఉండలేరు. వాళ్లకు తమ హీరోలు విరామం లేకుండా సినిమాలు చేస్తుండాలి. మూణ్నాలుగు నెలలకో రిలీజ్ ఉండేలా చూసుకోవాలి. సినిమా మొదలైన దగ్గర్నుంచి అప్డేట్ల వర్షం కురిపిస్తుండాలి. ఐతే వాళ్ల అంచనాలను అందుకోవడం ప్రస్తుతం ఏ స్టార్ హీరోకూ సాధ్యం అయ్యే పని కాదు. ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా కష్టమైపోతోంది.
ఇక చిత్రీకరణ మొదలయ్యాక అందరి దృష్టీ సినిమా ఎంత బాగా తీయాలనే దాని మీదే ఉంటుంది తప్ప.. అప్డేట్ల గురించి ఆలోచించరు. కానీ అభిమానులు మాత్రం ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా గొడవ గొడవ చేస్తుంటారు. అప్డేట్.. అప్డేట్ అంటూ.. ట్విట్టర్లో ఉద్యమాలు చేయడమే కాక.. తమ హీరోలు ఏదైనా వేడుకలకు వచ్చినపుడు కూడా నినాదాలు చేస్తుంటారు. ఈ విషయంలో ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను మందలించడం తెలిసిందే.
కట్ చేస్తే ఇప్పుడు ఓవైపు మహేష్ బాబు ఫ్యాన్స్, మరోవైపు ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో అప్డేట్స్ కోసం గొడవ గొడవ చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న కొత్త చిత్రం నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ను ఉగాది కానుకగా రిలీజ్ చేస్తారని కొన్ని రోజుల ముందు ప్రచారం మొదలైంది. అది తాజాగా మరింత ఊపందుకుంది. అప్డేట్ వచ్చేస్తోందని.. దీని గురించి అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారని ఫ్యాన్స్ నానా హంగామా చేశారు ఆదివారం. తీరా చూస్తే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. దీంతో నిర్మాత, దర్శకులను టార్గెట్ చేస్తూ ట్రెండ్ మొదలుపెట్టారు. ఫ్యాన్స్ దారుణమైన బూతు మాటలు అంటున్నారు మేకర్స్ను.
మరోవైపు ప్రభాస్ అభిమానులేమో.. ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించి ప్రమోషన్లే మొదలుపెట్టకపోవడంపై మండిపడుతున్నారు. దర్శక నిర్మాత ఓం రౌత్ మేలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. అసలే సినిమాకు బజ్ తక్కువగా, నెగెటివిటీ ఎక్కువగా ఉందని.. అలాంటిది పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ప్రమోషన్లు మొదలుపెట్టకపోవడం ఏంటని అంటున్నారు. విడుదలకు మూడు నెలలు కూడా సమయం లేదని… వెంటనే టీం ప్రమోషన్లు ఆరంభించాలని వాళ్లు సూచిస్తూ ట్రెండ్ నడిపిస్తున్నారు.
This post was last modified on March 20, 2023 12:14 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…