ఏ ముహూర్తంలో నిర్మాత దిల్ రాజు వేణు యెల్దెండికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో, ఎలాంటి భారీ ఖర్చు లేకుండా బలంగా తీశాడో అదే ఇప్పుడు బంగారు బాతులా మారిపోయింది. విజయవంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టిన ఈ చిన్న సినిమా పదిహేడు రోజులకు గాను 18 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం ట్రేడ్ ని నివ్వెరపరుస్తోంది. ఇందులో సింహభాగం అంటే దాదాపు 60 శాతానికి పైగా నైజామ్ నుంచి వస్తున్నదే. ఒకవేళ ఆంధ్రా నుంచి కూడా ఇదే స్థాయి స్పందన వచ్చి ఉంటే ఈ క్యాటగిరీలో ఆల్ టైం రికార్డులు దక్కేవని విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు.
నిన్న చాలా హౌస్ ఫుల్స్ పడ్డాయంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉదాహరణకు ఆదివారం మధ్యాన్నం పూట హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, కబ్జల ఆక్యుపెన్సీలు సోసోగా ఉంటే బలగం మాత్రం సింగల్ సీట్ లేకుండా మొత్తం హౌస్ ఫుల్ అయిపోయింది. టాక్ అటుఇటు ఉన్నవాటికి పోవడం కన్నా చూడని హిట్ సినిమాకు టికెట్ కొనడం ఉత్తమమని ప్రేక్షకులు భావించడం వల్లే ఈ పరిస్థితి. బిసి సెంటర్స్ లోనూ గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. ఫైనల్ రన్ అయ్యేలోపు బలగం పాతిక కోట్ల గ్రాస్ ని ఈజీగా దాటుతుందనే అంచంలా నిజమయ్యేలా ఉంది.
ఈ విజయం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. నిన్నా మొన్నటిదాకా విడుదల కోసం ఇబ్బంది రంగమార్తాండని షోలు చూపించి మరీ కృష్ణవంశీ ప్రమోట్ చేసుకుని ఫైనల్ గా ఉగాది రోజు థియేటర్లకు తెస్తున్నారు. ముందు ఓటిటికి అనుకున్న ఇంటింటి రామాయణంలోనూ బలమైన తెలంగాణ నేటివిటీ ఉండటంతో దీనికీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. త్వరలోనే డేట్లు ఫిక్స్ చేయబోతున్నారు. టెక్నాలజీ ఎంత మారినా సంప్రదాయాలు, పద్దతుల మీద సరైన రీతిలో చూపిస్తే ఆదరణ దక్కుతుందని బలగం నిరూపించిన నేపథ్యంలో ఇదే తరహాలో కథలు రాసుకుంటున్నారు రచయితలు.
This post was last modified on March 20, 2023 12:03 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…