ఏ ముహూర్తంలో నిర్మాత దిల్ రాజు వేణు యెల్దెండికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో, ఎలాంటి భారీ ఖర్చు లేకుండా బలంగా తీశాడో అదే ఇప్పుడు బంగారు బాతులా మారిపోయింది. విజయవంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టిన ఈ చిన్న సినిమా పదిహేడు రోజులకు గాను 18 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం ట్రేడ్ ని నివ్వెరపరుస్తోంది. ఇందులో సింహభాగం అంటే దాదాపు 60 శాతానికి పైగా నైజామ్ నుంచి వస్తున్నదే. ఒకవేళ ఆంధ్రా నుంచి కూడా ఇదే స్థాయి స్పందన వచ్చి ఉంటే ఈ క్యాటగిరీలో ఆల్ టైం రికార్డులు దక్కేవని విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు.
నిన్న చాలా హౌస్ ఫుల్స్ పడ్డాయంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉదాహరణకు ఆదివారం మధ్యాన్నం పూట హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, కబ్జల ఆక్యుపెన్సీలు సోసోగా ఉంటే బలగం మాత్రం సింగల్ సీట్ లేకుండా మొత్తం హౌస్ ఫుల్ అయిపోయింది. టాక్ అటుఇటు ఉన్నవాటికి పోవడం కన్నా చూడని హిట్ సినిమాకు టికెట్ కొనడం ఉత్తమమని ప్రేక్షకులు భావించడం వల్లే ఈ పరిస్థితి. బిసి సెంటర్స్ లోనూ గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. ఫైనల్ రన్ అయ్యేలోపు బలగం పాతిక కోట్ల గ్రాస్ ని ఈజీగా దాటుతుందనే అంచంలా నిజమయ్యేలా ఉంది.
ఈ విజయం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. నిన్నా మొన్నటిదాకా విడుదల కోసం ఇబ్బంది రంగమార్తాండని షోలు చూపించి మరీ కృష్ణవంశీ ప్రమోట్ చేసుకుని ఫైనల్ గా ఉగాది రోజు థియేటర్లకు తెస్తున్నారు. ముందు ఓటిటికి అనుకున్న ఇంటింటి రామాయణంలోనూ బలమైన తెలంగాణ నేటివిటీ ఉండటంతో దీనికీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. త్వరలోనే డేట్లు ఫిక్స్ చేయబోతున్నారు. టెక్నాలజీ ఎంత మారినా సంప్రదాయాలు, పద్దతుల మీద సరైన రీతిలో చూపిస్తే ఆదరణ దక్కుతుందని బలగం నిరూపించిన నేపథ్యంలో ఇదే తరహాలో కథలు రాసుకుంటున్నారు రచయితలు.
This post was last modified on March 20, 2023 12:03 pm
వైసీపీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలను మంత్రులు అస్సలు ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎక్కడా వెనుకాడవద్దని ఆయన…
అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, అమరావతి నిర్మాణం గురించి వచ్చిన కథనం…
జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు వీఐపీ ఖైదీలు అక్కడ కూడా రాజభోగాలు అనుభవిస్తున్న ఘటనలు అనేకం చూశాం. జైలులోనే ఫైవ్…
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…