సినిమా విడుదల ముందు వరకు ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు. అదంతా ప్రమోషన్లో భాగమే. తప్పేమీ కాదు. అందరూ చేస్తారు. బాలేదని ముందే అర్థమైపోయినా ఓపెనింగ్స్ కోసమో నమ్మి కొన్న బయ్యర్ల కోసమో కొన్ని మాయ మాటలు చెప్పక తప్పదు. కానీ రిలీజయ్యాక ఈ కనికట్టు చేయలేం. ఎందుకంటే కళ్ళముందు నిజాలు పబ్లిక్ టాక్, రివ్యూలు, రిపోర్ట్స్ రూపంలో ప్రత్యక్షంగా కనిపిస్తాయి. అయినా సరే నవ్విపోదురు నాకేంటి అనే రీతులో కొందరు ఫేక్ కలెక్షన్ల నెంబర్లలో మభ్యపెడుతూ ఉంటారు. మొన్న శుక్రవారం వచ్చిన కబ్జ విషయంలో ఇదే జరుగుతోంది.
భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల కబ్జ తిరస్కారానికి గురయ్యింది. అయినా సరే రెండు రోజుల్లో వంద కోట్ల క్లబ్బులో చేరిపోయామంటూ అఫీషియల్ పోస్టర్లు వదిలారు. బెంగళూరులో ఏకంగా సక్సెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఒకవేళ అంత గ్రాస్ వచ్చిందనుకున్నా అందులో షేర్ ఎంతలేదన్నా యాభై నుంచి అరవై కోట్ల మధ్యలో ఉంటుంది. కానీ ట్రేడ్ నుంచి వస్తున్న సమాచారం మేరకు అన్ని లాంగ్వేజెస్ మొత్తం కలిపినా పాతిక కోట్లు దాటి ఉండదట. అలాంటప్పుడు మరీ ఇంత వ్యత్యాసంతో వసూళ్లను చెప్పుకోవడం విమర్శలకు తావిస్తోంది.
కన్నడలోనూ కబ్జకు బ్రహ్మరథం పట్టలేదు. కాకపోతే స్టార్ ఇమేజ్ వల్ల వీకెండ్ కొన్ని సెంటర్లలో మంచి నెంబర్లు వచ్చాయి తప్పించి అక్కడి మీడియా చెబుతున్నట్టు అద్భుతాలు జరిగిపోవడం లేదు. ముఖ్యంగా కెజిఎఫ్ ని ఫాలో అవుతూ జిరాక్స్ తీసినట్టుగా కబ్జను రాసుకోవడం ప్రేక్షకుల్లో నెగటివిటీకి కారణమయ్యింది. శని ఆదివారాలు తెలుగు రాష్ట్రాల్లో కనీసం పావు వంతు ఫుల్ కానీ థియేటర్లు కోకొల్లలుగా ఉన్నాయి. ఫైనల్ కామెడీ ఏంటంటే కబ్జ 2లో పవన్ కళ్యాణ్ ఉండొచ్చని దర్శకుడు చంద్రు ఇటీవలే ఆయన్ను కలిసిన ఫోటోని వాడుతూ కథనాలు వెలువరించడం..
This post was last modified on March 20, 2023 10:41 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…