ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం రకరకాల కారణాల వల్ల సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరుగుతోంది. మరి కొన్ని రోజుల్లోనే సినిమాకు ముహూర్త వేడుక జరిపి.. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేయాలనుకుంటున్నారు.
ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ఖరారైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె లుక్ను కూడా రిలీజ్ చేశారు. తారక్తో తాను నటించే అవకాశాలున్నట్లు ముందే సంకేతాలు ఇచ్చిన జాన్వి.. ఇప్పుడు ఈ విషయం అధికారికం అయిన నేపథ్యంలో జూనియర్తో జట్టు కట్టడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే రెండుసార్లు చూశా. ఆయన అందం, ఎనర్జీ అసామాన్యం. తారక్తో కలిసి పని చేసే అవకాశం వస్తే బాగుంటుందని గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పా. ప్రతిరోజూ ఇదే విషయం దేవుడిని కోరుకునేదాన్ని. ఎట్టకేలకు ఆ అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ 30 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆతృతగా ఉంది. సెట్లోకి అడుగు పెట్టేందుకు దర్శకుడు కొరటాల శివకు ప్రతి రోజూ మెసేజ్లు పెడుతున్నా అని జాన్వి చెప్పింది.
ధడక్ అనే సూపర్ హిట్ మూవీతో బాలీవుడ్లో కథానాయికగా అరంగేట్రం చేసిన జాన్వి.. ఆ తర్వాత గుంజన్ సక్సేనా, గుడ్ లక్ జెర్రీ, మిలి చిత్రాల్లో నటించింది. ఆమె చివరి మూడు చిత్రాలూ ఓటీటీలో నేరుగా విడుదలై మంచి స్పందనే తెచ్చుకున్నాయి. దక్షిణాదిన ఆమెకు తారక్తో చేయబోయేదే తొలి చిత్రం.
This post was last modified on March 20, 2023 7:21 am
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…
తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…
ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…
వైసీపీ అధినేత జగన్ ఏలక్ష్యంతో అయితే.. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారో.. ఆ లక్ష్యం నెరవేరకుండానే వెనుదిరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికి…