శివశక్తి దత్తా.. కీరవాణి తండ్రిగా గుర్తింపు పొందడానికంటే ముందు రచయితగా టాలీవుడ్లో ఆయన బాగానే పాపులర్. తన సోదరుడు విజయేంద్ర ప్రసాద్తో కలిసి ఆయన జానకి రాముడు సహా పలు హిట్ చిత్రాలకు కథ అందించారు. తన కొడుకు నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కీరవాణి తన కెరీర్లో చేసిన ఎన్నో పాటలతో పోలిస్తే నాటు నాటు అంత గొప్ప పాటేమీ కాదని.. ఇందులో సంగీతం ఎక్కడుందని ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ సంగతిలా ఉంచితే.. ఒకప్పుడు వైభవం చూసిన తమ కుటుంబం.. తర్వాత సినిమాల్లో డబ్బులు పోగొట్టుకుని ఎంతటి దయనీయ స్థితిని ఎదుర్కొందో శివశక్తి దత్తా చెప్పుకొచ్చారు.
నాకు సినిమా అంటే ప్యాషన్, మేం నలుగురు అన్నదమ్ములం. మేమంతా తుంగభద్ర ప్రాంతానికి లవల వెళ్లాం. అక్కడ 16 ఏళ్ల పాటు ఉన్నాం. ఆ ప్రాంతంలో నేను 300 ఎకరాలు కొన్నాను. కానీ సినిమాల కోసం ఆ భూమి అంతా అమ్మేశా. చివరికి ఈ రోజు పూట గడవడం ఎలా అనే పరిస్థితికి వచ్చాం. ఆ సమయంలో నేను, విజయేంద్ర ప్రసాద్ కలిసి మంచి మంచి కథలు రాశాం. కొండవీటి సింహం, జానకి రాముడు లాంటి హిట్ సినిమాలకు మేం పని చేశాం.
ఐతే మేం కుదురుకోవడానికి ముందు కీరవాణి.. చక్రవర్తి దగ్గర పని చేసేవాడు. అతను తెచ్చిన డబ్బులతోనే ఇల్లు గడిచేది. కీరవాణి అంటే నాకు పంచ ప్రాణాలు. మూడో ఏటే అతడికి సంగీతం నేర్పించా. తన టాలెంట్ చూసి ఆశ్చర్యపోతుంటా. కానీ నాటు నాటు పాట నాకు అంతగా నచ్చలేదు. ఇందులో సంగీతం ఎక్కడుందన్నది నా ప్రశ్న. ఐతే ఇన్నాళ్లూ కీరవాణి చేసిన కృషికి ఈ పాటకు ఆస్కార్ రూపంలో ఫలితం దక్కిందనుకుంటున్నా అని శివశక్తి దత్తా అన్నారు.
This post was last modified on March 20, 2023 7:06 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…