కొన్ని నెలల కిందట తమిళ సీనియర్ నటుడు, దర్శకుడు అర్జున్.. టాలీవుడ్ యువ నటుడు విశ్వక్సేన్ మీద తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం తెలిసిందే. అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించి, షూటింగ్ మొదలయ్యాక విశ్వక్ వెనక్కి తగ్గడం ఆయన్ని తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురి చేసింది.
ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ మీద విరుచుకుపడ్డారు. దీనిపై ఇంతకుముందు ఒక కార్యక్రమంలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశ్వక్. స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందక, అర్జున్తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్లు అతను చెప్పాడు.
కాగా తన కొత్త సినిమా ధమ్కీ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన విశ్వక్కు ఈ విషయమై ప్రశ్న ఎదురైంది. అర్జున్ సినిమా నుంచి తప్పుకున్నందుకుగాను పెద్ద మొత్తంలో నష్టపరిహారం కట్టాల్సి వచ్చినట్లుగా వచ్చిన వార్తలపై ప్రశ్నించగా విశ్వక్ సూటిగా సమాధానం చెప్పలేదు.
దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ వ్యవహారానికి ఈ సినిమాకు సంబంధం లేదు. ఎంతోమందిపై ఉన్న గౌరవంతో నేను ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు అని విశ్వక్ అన్నాడు. ఇక ధమ్కీ సినిమాకు ముందు నరేష్ కుప్పిలిని దర్శకుడిగా అనుకుని, తర్వాత తప్పించడం గురించి విశ్వక్ స్పందిస్తూ.. ముందు ఈ సినిమాకు నరేష్నే దర్శకుడిగా అనకున్నాం.
అతను నేను కలిసి పాగల్ సినిమా చేశాం. ధమ్కీ సినిమాకు అతను న్యాయం చేయగలడని అనుకున్నా. కానీ కథా చర్చలు జరుగుతున్నపుడు అతడి శైలికి, నా కథకు సింక్ కాదనిపించింది. అందుకే నేనే డైరెక్ట్ చేయాలనుకున్నా. తనతో మరో సినిమా చేస్తానని చెప్పాను. నాకు, అతడికి గొడవలు కానీ, వాదనలు కానీ ఏమీ జరగలేదు. ఇందులో వివాదం ఏమీ లేదు అని విశ్వక్ వివరణ ఇచ్చాడు. ధమ్కీ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 19, 2023 4:52 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…