Movie News

వెంకీ సిరీస్‌పై విజయశాంతి పంచ్‌లు

సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చాక.. సినిమా వాళ్ల మీద విమర్శలు చేయాల్సి వచ్చినపుడు కొందరు సంయమనం పాటిస్తే.. కొందరేమో అలాంటి మొహమాటాలేమీ పెట్టుకోకుండా ఘాటు వ్యాఖ్యలు చేసేస్తుంటారు. రోజాతో పాటు విజయశాంతి ఈ కోవకే చెందుతారు. చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల మీద రోజా ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో తెలిసిందే. విజయశాంతి కూడా గతంలో చిరు మీద ఘాటు వ్యాఖ్యలే చేసింది.

కొన్నేళ్ల ముందు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఇదే విషయమై చిరంజీవి స్పందిస్తూ.. తాను రాజకీయాల్లో ఉండగా విజయశాంతి చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెందినట్లు వెల్లడించారు. కానీ విజయశాంతి మాత్రం రాజకీయాల్లో ఇవన్నీ సహజం.. తేలిగ్గా తీసుకోవాలంటూ హితవు పలికారు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు విజయశాంతి ఒకప్పటి తన మరో కోస్టార్ అయిన విక్టరీ వెంకటేష్ చేసిన వెబ్ సిరీస్ మీద పరోక్షంగా విమర్శలు గుప్పించింది.

వెంకీ నటించిన నెట్‌ఫ్లిక్స్ షో ‘రానా నాయుడు’లో అడల్ట్ కంటెంట్ మీద తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి షోలు వచ్చినపుడల్లా ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్ ఉండాలనే చర్చ జరుగుతోంది. విజయశాంతి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘రానా నాయుడు’ పేరు పెట్టకుండా ఇటీవలే విడుదలైన ఒక తెలుగు టీవీ షో అని పేర్కొంటూ ఆమె విమర్శలు గుప్పించారు.

ఓటీటీలకు సెన్సార్ ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ, ప్రత్యేకించి మహిళలు నివేదిస్తున్నారని.. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకోని ఓటీటీల్లో అసభ్యతతో కూడిన కటెంట్‌ని తొలగించేలా చూడాలని.. ప్రజా, తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోవద్దని విజయశాంతి హెచ్చరించారు. నటులకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నానని.. భవిష్యత్తులో ఓటీటీ ప్రసారాలు ప్రజలు, మహిళా వ్యతిరేకతకు గురి కాకుండా చూసుకోవాలని ఆమె సూచించారు.

This post was last modified on March 19, 2023 4:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

40 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago