Movie News

అతిథిని, మహర్షిని కలిపితే..


ప్రస్తుతం తెలుగులో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అతడు’ ఒక క్లాసిక్‌లా నిలిచిపోయింది. రెండో చిత్రం ‘ఖలేజా’ థియేటర్లలో డిజాస్టర్ అయినప్పటికీ టీవీల్లో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. వీరి కలయికలో సుదీర్ఘ విరామం తర్వాత రాబోతున్న కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అనివార్య కారణాల వల్ల కొంచెం ఆలస్యంగా సెట్స్ మీదికి వెళ్లిన ఈ చిత్రం.. ప్రస్తుతం జోరుగానే చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ సినిమా టైటిల్ గురించి ఇటీవల ఆసక్తికర చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఉగాది కానుకగా సినిమా టైటిల్; ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందన్న అంచనాలున్నాయి. ఈ లోపు శాంపిల్ కింద ఒక ఆన్ లొకేషన్ పిక్ ఒకటి షేర్ చేసింది చిత్ర బృందం. అందులో మహేష్ త్రివిక్రమ్‌లతో పాటు మలయాళ నటుడు జయరాం కూడా కనిపిస్తున్నాడు.

ఐతే ఇందులో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది మహేష్ బాబు లుక్కే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ లుక్ మహేష్ రెండు మూడు సినిమాలను గుర్తుకు తెస్తోంది. ఇలా మహేష్ పొడవాటి జుట్టును చక్కగా స్టైలింగ్ చేయించుకుని కనిపించింది మొదటగా ‘అతిథి’ సినిమాలో. ఆ తర్వాత ‘సర్కారు వారి పాట’లోనూ అదే జులపాల జుట్టుతో కనిపించాడు కానీ.. ‘అతిథి’లో ఉన్న రఫ్ లుక్ ఇక్కడ లేదు.

ఐతే మధ్యలో మహేష్ చేసిన ‘మహర్షి’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ వరకు కొంచెం గడ్డం, మీసంతో కనిపించాడు మహేష్. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సెట్ చేసుకున్న లుక్‌ను గమనిస్తే ‘అతిథి’, ‘మహర్షి’ సినిమాల రెఫరెన్స్ తీసుకున్నట్లు.. ఆ రెండు చిత్రాల లుక్స్ కలగలిపినట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ లుక్‌లో మహేష్ కొత్తగా కనిపిస్తున్న మాట వాస్తవం. ఫస్ట్ లుక్‌లో మహేష్ ఇంకా పాలిష్ చేసిన లుక్‌లో కనిపించే అవకాశముంది. ఇక ఈ చిత్రానికి ‘అమ్మపాట’ సహా కొన్ని టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

This post was last modified on March 18, 2023 7:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

49 minutes ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

50 minutes ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

4 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

6 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

8 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

9 hours ago