పఠాన్ తరువాత వేరే ఆప్షన్ లేక దాంతోనే నెట్టుకొస్తున్న బాలీవుడ్ కు ఆ మధ్య కొత్త రిలీజులెవీ ఉత్సాహాన్ని కలిగించలేదు. షెహజాదా, సెల్ఫీలు ఫ్లాప్ కాగా తూ ఝూటి మై మక్కర్ క్రమంగా గట్టెక్కుతోంది. నిన్న కొత్త సినిమాలు రిలీజైన విషయం జనాలకు పెద్దగా తెలియకుండానే థియేటర్లలో అడుగు పెట్టాయి. వాటిలో అంతో ఇంతో బజ్ ఉన్నది మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే ఒకటే. చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్న రాణి ముఖర్జీ మర్దానీ 2 తర్వాత చేసిన మూవీ ఇదే. గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా ఇండియా వైడ్ కేవలం 500 స్క్రీన్లలో మాత్రమే విడుదల చేశారు.
మొదటిరోజు కోటిన్నర మాత్రమే వసూళ్లు వచ్చినా టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది. కారణం కంటెంట్ మీద పాజిటివ్ టాక్ రావడమే. ఇది రియల్ లైఫ్ స్టోరీ. 2012లో సాగరిక అనే భారతీయురాలి పిల్లలను నార్వే ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. దాంతో విదేశీ గవర్నమెంట్ తో పోరాటం మొదలుపెట్టిన ఆ తల్లి ఏకంగా రెండు దేశాల మధ్య సంబంధాల మీదే ప్రభావం చూపిస్తుంది. అసలు మాటలే సరిగా రాని పసిగుడ్లకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, తండ్రి ఏమయ్యాడు లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. మంచి డ్రామా జొప్పించారు.
టాక్ తో పాటు రివ్యూలు పాజిటివ్ గా రావడంతో మెల్లగా ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతున్నారు. మల్టీప్లెక్సుల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా దర్శకురాలు ఆషిమా చిబ్బర్ తీసిన ఈ ఎమోషనల్ మూవీలో మెలోడ్రామా కాస్త అధికంగానే ఉన్నప్పటికీ ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ వల్ల మరీ బోర్ కొట్టకుండా నీట్ గా సాగింది. నిజ జీవిత కథ ఆధారంగా తీయడం వల్ల కమర్షియల్ ఎలిమెంట్స్ కి చోటు దక్కలేదు. ఒకపక్క కబ్జతో పాటు కపిల్ శర్మ హీరోగా డెబ్యూ చేసిన జ్విగాటోకు పెద్దగా స్పందన రాలేదు. సో మిసెస్ ఛటర్జీ కనక బలంగా నిలబడితే హిట్టు పడినట్టే.
This post was last modified on March 18, 2023 6:24 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…