ఎప్పుడో 2010లో వచ్చిన అల్లు అర్జున్ వరుడు సినిమా గుర్తుందా. అప్పట్లో విపరీతమైన పబ్లిసిటీతో ఆడియన్స్ లో భారీ అంచనాలు రేకెత్తించిన ఈ సినిమాకు దర్శకుడు గుణశేఖర్. హీరోయిన్ ని చూపించకుండా ఫస్ట్ లుక్ లాంటిది లేకుండా డైరెక్ట్ థియేటర్లలోనే చూడమని చేసిన ప్రమోషన్ బాగా వైరల్. సోషల్ మీడియా పెద్దగా లేని కాలంలోనే టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆ అమ్మాయి పేరు భానుశ్రీ మెహ్రా. అది డిజాస్టర్ కావడంతో మళ్ళీ తనకు అవకాశం రాలేదు. ఏదేదో ఊహించుకున్న జనాలకు తను అంత అందంగా లేకపోవడం మైనస్ అయ్యింది.
ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ భానుశ్రీ సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఏకంగా బన్నీని లక్ష్యంగా చేసుకుంది. కారణం ఏంటయ్యా అంటే ఈ అమ్మడు ఇటీవలే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. ఏవేవో వీడియోలు పెడుతోంది. టూర్లు, వ్యక్తిగత జీవితానివి కొన్ని అప్లోడ్ చేసింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. పట్టుమని అయిదు వేల సబ్స్క్రైబర్స్ కూడా లేరు. దీంతో ఏదో రకంగా కౌంట్ పెంచుకోవాలనే ఉద్దేశంతో బన్నీ ఫ్యాన్స్ క్లబ్స్ ని ట్యాగ్ చేయడం అక్కడితో ఆగకుండా ఏకంగా హీరోని పదే పదే ప్రస్తావిస్తూ ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు చేయడం షురూ చేసింది.
దీంతో అల్లు అర్జున్ ఆమెను బ్లాక్ చేశాడు. ఆఖరికి దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ప్రచారానికి వాడేసుకుంటోంది. ఏదో ఇలా వైరల్ కావడం వల్ల చందాదారులు పెరిగి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వచ్చి లక్షల ఆదాయం వస్తుందనే ప్లాన్ కాబోలు. అయినా అభిమానులు అంత అమాయకముగా ఉండరుగా. ఆమె ఘనకార్యాన్ని రివర్స్ లో అదే స్క్రీన్ షాట్ మంత్రం ఉపయోగించి బట్టబయలు చేస్తున్నారు. అసలే ఆ వరుడు మర్చిపోలేని గాయమని అభిమానులు ఫీలవుతుంటారు. అలాంటిది ఇప్పుడా హీరోయిన్ వచ్చి ఈ టైపు చర్యలకు పాల్పడితే ఊరుకుంటారా.
This post was last modified on March 18, 2023 5:20 pm
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…