జూనియర్ ఎన్టీఆర్ ని విపరీతంగా అభిమానించే విశ్వక్ సేన్ కోసం ప్రయాణాలు, పనులు బడలిక ఉన్నప్పటికీ ఇచ్చిన మాట కోసం తారక్ దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి మాట నిలబెట్టుకున్నాడు. ఆస్కార్ వేడుక పూర్తి చేసుకుని యుఎస్ నుంచి హైదరాబాద్ వచ్చిన రెండు రోజులకే ఈ వేడుక ఉన్నప్పటికీ ఎప్పుడో ఇచ్చిన మాట కోసం నిన్న సాయంత్రం హాజరయ్యాడు. పరస్పరం ఇద్దరూ తమ మీద ప్రేమాభిమానులను స్టేజి మీద వ్యక్తపరిచారు. విశ్వక్ లాగా దూకుడుగా ఓపెన్ గా తాను ఎప్పటికీ మాట్లాడలేనని ఆ ఎనర్జీ తనకు బాగా ఇష్టమని జూనియర్ అన్నాడు.
ఎప్పుడైనా మూడ్ బాలేనప్పుడు ఈ నగరానికి ఏమైంది చూస్తానని అందులో విశ్వక్ బాధను దిగమింగుతూ నవ్వించే యాక్టింగ్ ఆకట్టుకుందని చెప్పాడు. తర్వాత ఫలక్ నుమా దాస్ చూసి పాగల్ లో ఇష్టపడి ఇతను ఒకే జానర్ కు కట్టుబడతాడేమో అనుకుంటున్న టైంలో అశోక వనంలో అర్జున కళ్యాణం మేకోవర్ చూసి షాక్ అయ్యానని చెప్పి ఆశ్చర్యపరిచిన తారక్ ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆస్కార్ పురస్కారం గురించీ దానికి సభ్యులంతా ఎంత కష్టపడింది ప్రస్తావించాడు. విశ్వక్ సేన్ లాంటి టాలెంటెడ్ హీరోలు దర్శకత్వం చేయకూడదని మంచి ప్రతిభ కలిగిన దర్శకులకు అవకాశం ఇవ్వాలని హితవు పలికాడు
మొత్తానికి చక్కని వాతావరణంలో దాస్ కా ధమ్కీ ఈవెంట్ ముగిసింది. వచ్చే వారం 22న విడుదల కాబోతున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ విశ్వక్ కి చాలా కీలకం. అసలేమాత్రం పోటీ లేదు. కాకపోతే ఆపై 30న నాని దసరా భారీ ఎత్తున వస్తుండటంతో దాన్ని కాచుకోవాలంటే ధమ్కీకి బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. ఆ నమ్మకమైతే టీమ్ లో కనిపిస్తోంది. ధమాకా లాంటి సినిమాలతో పోలికలను మరోసారి కొట్టిపారేస్తున్న విశ్వక్ దీనికి స్వీయ దర్శకత్వం వహించడంతో సక్సెస్ పరంగా ఒత్తిడి ఇంకొంచెం అధికంగా ఉంది. నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ధమ్కీలో హీరో పాత్ర డ్యూయల్ రోల్
This post was last modified on March 18, 2023 11:12 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…