Movie News

ఆస్కార్ ఇచ్చారు.. కానీ అవమానించారు

ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట మాత్రమే కాదు.. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే ఇండియన్ డాక్యుమెంటరీ కూడా పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గునీత్ మోంగా ఆస్కార్ అవార్డుల నిర్వాహకులు తన పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ఆస్కార్ అవార్డు అందుకున్న అనంతరం తనకు అవమానం జరిగిందని ఆమె వెల్లడించారు. ఆస్కార్ అందుకున్న తర్వాత ప్రతి ఒక్కరికీ 45 సెకన్లు మాట్లాడే అవకాశం ఇస్తారు. ఒకవేళ ఎవరైనా అంతకుమించి సమయం మాట్లాడుతుంటే మైక్ కట్ చేసి మ్యూజిక్ ప్లే చేస్తారు. కానీ గునీత్ మోంగా తన ప్రసంగం మొదలుపెట్టగానే మైక్ కట్ చేసి మ్యూజిక్ ప్లే చేశారట. దీంతో తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండానే వెనుదిరగాల్సి వచ్చిందంటూ ఇండియాకు వచ్చాక విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

“ఆస్కార్ వేదిక మీద నేను మైక్ తీసుకుని మాట్లాడబోతుంటే మ్యూజిక్ ప్లే చేశారు. గొప్ప క్షణాలను నాకు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి లాక్కున్నట్లు అనిపించింది. నా తర్వాత బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ పురస్కారాలు అందుకున్న వారు 45 సెకన్లకు మించి మాట్లాడినా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. నాకు మాత్రం ఇలా ఎందుకు చేశారో అర్థం కాలేదు” అని గునీత్ మోంగా పేర్కొన్నారు.

గునీత్ మోంగా పేరు అంత పాపులర్ కాదు కానీ.. ఆమె గొప్ప గొప్ప సినిమాలే నిర్మించారు. గతంలో ఆస్కార్ అవార్డు కోసం ఇండియా తరఫున నామినేట్ అయిన ‘లంచ్ బాక్స్’తో పాటు ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’, ‘మసాన్’, ‘జల్లికట్టు’, ‘ఆకాశం నీ హద్దురా’, ‘విసారణై’ లాంటి గొప్ప చిత్రాలకు గునీత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇలాంటి గొప్ప చిత్రాల్లో భాగస్వామిగా ఉన్న ఆమె.. ఇప్పుడు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’తో ఆస్కార్ అవార్డునూ సొంతం చేసుకున్నారు.

This post was last modified on March 18, 2023 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

30 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago