Movie News

బుచ్చిబాబు సినిమా గురించి చరణ్ ఎలివేషన్లు

ఆస్కార్ సంరంభం పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చిన రామ్ చరణ్ ఇండియా టుడే సంస్థ నిర్వహించే కాంక్లేవ్ కోసం ఢిల్లీలో దిగి అది పూర్తి చేసుకుని నిన్న రాత్రి బాగా ఆలస్యమయ్యాక బేగంపేట్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. కొడుకుని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా దేశ రాజధానికి వెళ్లిన చిరంజీవి అక్కడే పలువురు ప్రభుత్వ పెద్దలు మంత్రులతో పాటు అమిత్ షాని కలిసి చరణ్ తో ఫోటోలు దిగడం ఆల్రెడీ వైరల్ అయ్యాయి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ చరణ్ లు ఒకే స్టేజిని పంచుకుంటారన్న వార్త నిజం కాలేదు. పైన చెప్పిన మీడియా ఈవెంట్ లో చరణ్ సోలోగానే ఉన్నాడు.

ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన ముచ్చట్లు పంచుకున్నాడు చరణ్. ముఖ్యంగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఇంకా ప్రారంభమే కానీ సినిమా గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చేశాడు. సబ్జెక్టు చాలా డిఫరెంట్ గా ఉంటుందని, తన బెస్ట్ మూవీస్ లో ఒకటైన రంగస్థలంని మించి ఇందులో పెర్ఫార్మన్స్ కి స్కోప్ దక్కబోతోందని, ఈ కథ కేవలం భారతీయులకే కాక వెస్ టర్న్ ఆడియన్స్ ని మెప్పించేలా చాలా స్పెషల్ గా ఉంటుందని వివరించాడు. నిజానికి ఫ్యాన్స్ ఆర్సి 15, శంకర్ టేకింగ్ గురించి ఏమైనా స్పెషల్ న్యూస్ చెబుతాడేమోనని ఎదురు చూశారు.

తీరా చూస్తే బుచ్చిబాబు గురించి చెప్పేసరికి ఒకరకంగా షాక్ తిన్నారు. మొత్తానికి రంగస్థలంకి మించి అని చెప్పడం ద్వారా ఇంకోసారి విలేజ్ డ్రామా చేయబోతున్న హింట్ అయితే ఇచ్చేశాడు. సెప్టెంబర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని కూడా చెప్పేశాడు కాబట్టి శంకర్ మూవీని దసరాలోపే పూర్తి చేయబోతున్న క్లారిటీ వచ్చేసింది. నిర్మాత దిల్ రాజు ఆశిస్తున్నట్టు  2024 సంక్రాంతి బరిలో దింపే ఛాన్స్ మెరుగయ్యింది. ఈ నెలాఖరులో చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ లాంచ్ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. సీఈఓ పేరు దాదాపుగా ఫిక్స్ అయినట్టేనట 

This post was last modified on March 18, 2023 10:43 am

Share
Show comments
Published by
satya

Recent Posts

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

1 hour ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

3 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

3 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

3 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

5 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

5 hours ago