ఆస్కార్ సంరంభం పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చిన రామ్ చరణ్ ఇండియా టుడే సంస్థ నిర్వహించే కాంక్లేవ్ కోసం ఢిల్లీలో దిగి అది పూర్తి చేసుకుని నిన్న రాత్రి బాగా ఆలస్యమయ్యాక బేగంపేట్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. కొడుకుని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా దేశ రాజధానికి వెళ్లిన చిరంజీవి అక్కడే పలువురు ప్రభుత్వ పెద్దలు మంత్రులతో పాటు అమిత్ షాని కలిసి చరణ్ తో ఫోటోలు దిగడం ఆల్రెడీ వైరల్ అయ్యాయి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ చరణ్ లు ఒకే స్టేజిని పంచుకుంటారన్న వార్త నిజం కాలేదు. పైన చెప్పిన మీడియా ఈవెంట్ లో చరణ్ సోలోగానే ఉన్నాడు.
ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన ముచ్చట్లు పంచుకున్నాడు చరణ్. ముఖ్యంగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఇంకా ప్రారంభమే కానీ సినిమా గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చేశాడు. సబ్జెక్టు చాలా డిఫరెంట్ గా ఉంటుందని, తన బెస్ట్ మూవీస్ లో ఒకటైన రంగస్థలంని మించి ఇందులో పెర్ఫార్మన్స్ కి స్కోప్ దక్కబోతోందని, ఈ కథ కేవలం భారతీయులకే కాక వెస్ టర్న్ ఆడియన్స్ ని మెప్పించేలా చాలా స్పెషల్ గా ఉంటుందని వివరించాడు. నిజానికి ఫ్యాన్స్ ఆర్సి 15, శంకర్ టేకింగ్ గురించి ఏమైనా స్పెషల్ న్యూస్ చెబుతాడేమోనని ఎదురు చూశారు.
తీరా చూస్తే బుచ్చిబాబు గురించి చెప్పేసరికి ఒకరకంగా షాక్ తిన్నారు. మొత్తానికి రంగస్థలంకి మించి అని చెప్పడం ద్వారా ఇంకోసారి విలేజ్ డ్రామా చేయబోతున్న హింట్ అయితే ఇచ్చేశాడు. సెప్టెంబర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని కూడా చెప్పేశాడు కాబట్టి శంకర్ మూవీని దసరాలోపే పూర్తి చేయబోతున్న క్లారిటీ వచ్చేసింది. నిర్మాత దిల్ రాజు ఆశిస్తున్నట్టు 2024 సంక్రాంతి బరిలో దింపే ఛాన్స్ మెరుగయ్యింది. ఈ నెలాఖరులో చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ లాంచ్ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. సీఈఓ పేరు దాదాపుగా ఫిక్స్ అయినట్టేనట
This post was last modified on March 18, 2023 10:43 am
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న 'ఫౌజీ' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. 1940ల…
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే…
లెనిన్ మరో సక్సెస్ మీట్ ఇవాళ జరిగింది. అఖిల్, నాగార్జున రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఈసారి నాగచైతన్య తోడవ్వడంతో…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద కిరణ్ అబ్బవరం భారీ నమ్మకం పెట్టుకున్నాడు. క,…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో తరం వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య…
అయోధ్య రామ్ ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది.…