తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడు కృష్ణవంశీ. తొలి చిత్రం ‘గులాబి’ మొదలుకుని.. నిన్నే పెళ్లాడతా, సింధూరం, మురారి, ఖడ్గం, చందమామ.. ఇలా క్లాసిక్స్ అందించి లెజెండరీ స్టేటస్ అందుకున్నాడు ఈ విలక్షణ దర్శకుడు. టాలీవుడ్లో ఎంతోమంది నవతరం దర్శకులకు ఆయన ఇన్స్పిరేషన్. ఒకప్పుడు తెలుగులో ప్రతి హీరో కూడా కృష్ణవంశీతో ఓ సినిమా చేయాలని ఆశపడేవారు. ఆయన మాత్రం స్టార్ల కోసం వెంపర్లాడకుండా తన కథలకు ఎవరు కరెక్ట్ అనుకుంటే వారితో సాహసోపేత సినిమాలు తీశాడు. ఈ క్రమంలో కొన్ని ఘనవిజయాలు అందుకున్నాడు. కొన్ని సినిమాలు తేడా కొట్టాయి కూడా.
ఐతే ఫ్లాప్ సినిమాలు తీసినా కృష్ణవంశీకి ప్రశంసలే దక్కేవి. తర్వాతి కాలంలో ఆ సినిమాలు టీవీల్లో విశేష ఆదరణ పొందేవి. కానీ ‘చందమామ’ తర్వాత ఒక ఛట్రంలో ఇరుక్కుపోయి.. ట్రెండుకు తగ్గట్లు సినిమాలు తీయలేక వెనుకబడిపోయాడు కృష్ణవంశీ.
ఐతే చాలా గ్యాప్ తర్వాత ‘నట సామ్రాట్’ అనే మరాఠీ సినిమాను ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేశాడు కృష్ణవంశీ. ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల వల్ల ఈ సినిమా బాగా ఆలస్యమై.. ఎట్టకేలకు ఈ నెల 22న రిలీజ్కు రెడీ అవుతోంది. ఐతే కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమాకు అస్సలు బజ్ లేదు. ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించలేదు. కానీ రిలీజ్ దగ్గర పడుతుండగా.. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సినీ ప్రముఖులు, మీడియా వాళ్లకు రోజుల తరబడి స్పెషల్ ప్రివ్యూలు వేస్తున్నారు. చూసిన వాళ్లందరూ సినిమా మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కృష్ణవంశీ మీద గౌరవంతో వచ్చి సినిమా చూసి దాని మీద నాలుగు మంచి మాటలు చెబుతున్నారు. ట్వీట్లు వేస్తున్నారు.
తెలుగు సినిమాకు కృష్ణవంశీ చేసిన సాయానికి.. ఇండస్ట్రీ కష్టకాలంలో ఆయన రుణం తీర్చుకుంటున్నట్లుగా ఉంది ఈ పరిణామం. ఏదైతేనేం రిలీజ్ టైంకి సినిమాకు హైప్ వచ్చి.. ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చి విజయం సాధిస్తే కృష్ణవంశీకి అది గొప్ప ఊరట అనడంలో సందేహం లేదు.
This post was last modified on March 17, 2023 4:02 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…