తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడు కృష్ణవంశీ. తొలి చిత్రం ‘గులాబి’ మొదలుకుని.. నిన్నే పెళ్లాడతా, సింధూరం, మురారి, ఖడ్గం, చందమామ.. ఇలా క్లాసిక్స్ అందించి లెజెండరీ స్టేటస్ అందుకున్నాడు ఈ విలక్షణ దర్శకుడు. టాలీవుడ్లో ఎంతోమంది నవతరం దర్శకులకు ఆయన ఇన్స్పిరేషన్. ఒకప్పుడు తెలుగులో ప్రతి హీరో కూడా కృష్ణవంశీతో ఓ సినిమా చేయాలని ఆశపడేవారు. ఆయన మాత్రం స్టార్ల కోసం వెంపర్లాడకుండా తన కథలకు ఎవరు కరెక్ట్ అనుకుంటే వారితో సాహసోపేత సినిమాలు తీశాడు. ఈ క్రమంలో కొన్ని ఘనవిజయాలు అందుకున్నాడు. కొన్ని సినిమాలు తేడా కొట్టాయి కూడా.
ఐతే ఫ్లాప్ సినిమాలు తీసినా కృష్ణవంశీకి ప్రశంసలే దక్కేవి. తర్వాతి కాలంలో ఆ సినిమాలు టీవీల్లో విశేష ఆదరణ పొందేవి. కానీ ‘చందమామ’ తర్వాత ఒక ఛట్రంలో ఇరుక్కుపోయి.. ట్రెండుకు తగ్గట్లు సినిమాలు తీయలేక వెనుకబడిపోయాడు కృష్ణవంశీ.
ఐతే చాలా గ్యాప్ తర్వాత ‘నట సామ్రాట్’ అనే మరాఠీ సినిమాను ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేశాడు కృష్ణవంశీ. ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల వల్ల ఈ సినిమా బాగా ఆలస్యమై.. ఎట్టకేలకు ఈ నెల 22న రిలీజ్కు రెడీ అవుతోంది. ఐతే కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమాకు అస్సలు బజ్ లేదు. ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించలేదు. కానీ రిలీజ్ దగ్గర పడుతుండగా.. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సినీ ప్రముఖులు, మీడియా వాళ్లకు రోజుల తరబడి స్పెషల్ ప్రివ్యూలు వేస్తున్నారు. చూసిన వాళ్లందరూ సినిమా మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కృష్ణవంశీ మీద గౌరవంతో వచ్చి సినిమా చూసి దాని మీద నాలుగు మంచి మాటలు చెబుతున్నారు. ట్వీట్లు వేస్తున్నారు.
తెలుగు సినిమాకు కృష్ణవంశీ చేసిన సాయానికి.. ఇండస్ట్రీ కష్టకాలంలో ఆయన రుణం తీర్చుకుంటున్నట్లుగా ఉంది ఈ పరిణామం. ఏదైతేనేం రిలీజ్ టైంకి సినిమాకు హైప్ వచ్చి.. ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చి విజయం సాధిస్తే కృష్ణవంశీకి అది గొప్ప ఊరట అనడంలో సందేహం లేదు.
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…