తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడు కృష్ణవంశీ. తొలి చిత్రం ‘గులాబి’ మొదలుకుని.. నిన్నే పెళ్లాడతా, సింధూరం, మురారి, ఖడ్గం, చందమామ.. ఇలా క్లాసిక్స్ అందించి లెజెండరీ స్టేటస్ అందుకున్నాడు ఈ విలక్షణ దర్శకుడు. టాలీవుడ్లో ఎంతోమంది నవతరం దర్శకులకు ఆయన ఇన్స్పిరేషన్. ఒకప్పుడు తెలుగులో ప్రతి హీరో కూడా కృష్ణవంశీతో ఓ సినిమా చేయాలని ఆశపడేవారు. ఆయన మాత్రం స్టార్ల కోసం వెంపర్లాడకుండా తన కథలకు ఎవరు కరెక్ట్ అనుకుంటే వారితో సాహసోపేత సినిమాలు తీశాడు. ఈ క్రమంలో కొన్ని ఘనవిజయాలు అందుకున్నాడు. కొన్ని సినిమాలు తేడా కొట్టాయి కూడా.
ఐతే ఫ్లాప్ సినిమాలు తీసినా కృష్ణవంశీకి ప్రశంసలే దక్కేవి. తర్వాతి కాలంలో ఆ సినిమాలు టీవీల్లో విశేష ఆదరణ పొందేవి. కానీ ‘చందమామ’ తర్వాత ఒక ఛట్రంలో ఇరుక్కుపోయి.. ట్రెండుకు తగ్గట్లు సినిమాలు తీయలేక వెనుకబడిపోయాడు కృష్ణవంశీ.
ఐతే చాలా గ్యాప్ తర్వాత ‘నట సామ్రాట్’ అనే మరాఠీ సినిమాను ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేశాడు కృష్ణవంశీ. ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల వల్ల ఈ సినిమా బాగా ఆలస్యమై.. ఎట్టకేలకు ఈ నెల 22న రిలీజ్కు రెడీ అవుతోంది. ఐతే కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమాకు అస్సలు బజ్ లేదు. ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించలేదు. కానీ రిలీజ్ దగ్గర పడుతుండగా.. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సినీ ప్రముఖులు, మీడియా వాళ్లకు రోజుల తరబడి స్పెషల్ ప్రివ్యూలు వేస్తున్నారు. చూసిన వాళ్లందరూ సినిమా మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కృష్ణవంశీ మీద గౌరవంతో వచ్చి సినిమా చూసి దాని మీద నాలుగు మంచి మాటలు చెబుతున్నారు. ట్వీట్లు వేస్తున్నారు.
తెలుగు సినిమాకు కృష్ణవంశీ చేసిన సాయానికి.. ఇండస్ట్రీ కష్టకాలంలో ఆయన రుణం తీర్చుకుంటున్నట్లుగా ఉంది ఈ పరిణామం. ఏదైతేనేం రిలీజ్ టైంకి సినిమాకు హైప్ వచ్చి.. ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చి విజయం సాధిస్తే కృష్ణవంశీకి అది గొప్ప ఊరట అనడంలో సందేహం లేదు.
This post was last modified on March 17, 2023 4:02 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…