పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరం తేజ్ తో కలిసి ‘వినోదాయ సీతమ్’ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సెట్స్ పై ఉన్న ‘హరి హరవీరమల్లు’ ను పక్కన పెట్టి ఈ రీమేక్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు పవన్. ఈ సినిమాకు గానూ పవన్ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని ప్రచారంలో ఉంది. తాజాగా పవన్ తన రెమ్యునరేషన్ బయటపెట్టేశాడు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాకు గానూ రోజుకి రెండు కోట్లు తీసుకుంటున్నానని పవన్ పొలిటికల్ ఈవెంట్ లో చెప్పుకున్నాడు. సినిమా పేరు చెప్పకుండా 22 రోజుల షూటింగ్ కి గానూ రోజుకి రెండు కోట్లు అందుతుందని తెలిపాడు. ఈ స్థాయి మీరిచ్చిందే అంటూ ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. అయితే పవన్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్ కోసం 22 రోజుల డేట్స్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో పవన్ ఆ సినిమా రెమ్యునరేషన్ గురించే చెప్పాడని క్లారిటీ వచ్చేసింది. మరో రెండు మూడు రోజులు కాల్షీట్ పెరిగితే పవన్ ఈ సినిమాకి 50 కోట్లు తీసుకున్నట్టే.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ స్టూడియోస్ సంస్థలు కలిసి పవన్ తో ఈ రీమేక్ సినిమా చేసి 100 కోట్లకి మార్కెట్ చేసే ఆలోచనలో ఉన్నారు. పవన్ రెమ్యూనరేషన్ తో కలిపి ఈ సినిమాపై డెబ్బై నుండి ఎనభై కోట్లు ఖర్చు చేయబోతున్నారు. తక్కువ రోజుల్లోనే ఈ సినిమాను కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఒరిజినల్ దర్శకుడినే ఈ సినిమాకు సెట్ చేశారు త్రివిక్రమ్. ఈ రీమేక్ సినిమాను పవన్ దగ్గరికి తీసుకెళ్లింది ప్రాజెక్ట్ సెట్ చేసింది అంతా త్రివిక్రమే.
This post was last modified on March 17, 2023 2:52 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…