గత ఏడాది వరుసగా రెండు డిజాస్టర్లతో నాగ చైతన్యకు పెద్ద దెబ్బే పడింది. ఫీల్ గుడ్ మూవీగా యూత్ ని ఆకట్టుకుంటుందని థాంక్ యు చేస్తే ఆడియన్స్ సారీ చెప్పారు. అమీర్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే ప్యాన్ ఇండియా మార్కెట్ లో గుర్తింపు వస్తుందనుకుంటే అది మరీ అన్యాయంగా డిజాస్టర్ అయ్యింది. అందుకే ఈసారి తమిళ విలక్షణ దర్శకుడిగా పేరున్న వెంకట్ ప్రభుతో చేతులు కలిపాడు. కమర్షియల్ ఫార్మాట్ లోనే ప్రయోగాలు చేయడంలో ఆయనది ప్రత్యేక శైలి. అందుకే అనౌన్స్ మెంట్ నుంచే దీని మీద అంచనాలు మొదలయ్యాయి. ఇందాక టీజర్ లంచ్ చేశారు.
గాయపడిన మనసు ఒక మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుందని నమ్మే ఒక యువకుడు(నాగ చైతన్య) కానిస్టేబుల్ గా పని చేస్తుంటాడు. వృత్తపరమైన సవాళ్లు ఎన్నో ఎదురుకుంటూ ఒక నిజం కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుంది. స్థానికంగా పలుబడి ఉన్న మాఫియా రౌడీ(అరవింద్ స్వామి)తో పాటు రాజకీయ నాయకులు పన్నే పద్మవ్యూహంలో నిజాయితీకి కట్టుబడటం ప్రాణాల మీదకు తెస్తుంది. ఒంటి మీద ఖాకీ చొక్కా ఉన్నా రాజీ పడని మనస్తత్వం ప్రమాదంలో పడేస్తుంది. ఇంతకీ ఇతని జీవితంలో కస్టడీ ఎందుకు వచ్చింది, ఎవరి కోసం ఇదంతా చేశాడనేదే స్టోరీ.
కీలకమైన ట్విస్టులు బయట పడకుండా టీజర్ ని జాగ్రత్తగా కట్ చేశారు. విజువల్స్ లో వెంకట్ ప్రభు మార్క్ యాక్షన్ కనిపిస్తోంది. హీరోయిన్ కృతి శెట్టితో సహా ఆర్టిస్టులు ఎవరిని రివీల్ చేయలేదు. అరవింద్ స్వామి ఫ్రేమ్స్ ని మాత్రమే చూపించారు. ఇళయరాజా యువన్ శంకర్ రాజా సంయుక్తంగా సంగీతమందించిన తొలి టాలీవుడ్ మూవీ ఇది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్టైలిష్ గా ఉంది. ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమ్ జీ అమరన్ ఇతర తారాగణం. కంటెంట్ ఇంతే సాలిడ్ గా ఉంటే మే 12న విడుదల కాబోతున్న కస్టడీ చైతు కెరీర్ బెస్ట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.
This post was last modified on March 16, 2023 10:12 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…