శత దినోత్సవం.. ఈ మాట ఎత్తితే కామెడీగా చూస్తున్నారు ఈ రోజుల్లో. ఏదైనా సినిమా ఒక్క థియేటర్లో వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్నా.. అది నిజమైన ఘనతగా భావించట్లేదు. పనికట్టుకుని ఆడిస్తే తప్ప మన దగ్గర ఏ సినిమా కూడా వంద రోజులు ఆడే పరిస్థితి లేదు. పెద్ద హిట్ అనిపించుకున్న సినిమాలు అతి కష్టం మీద కొన్ని థియేటర్లలో 50 రోజులు ఆడుతున్నాయంతే. ఒకప్పట్లా అర్ధశత దినోత్సవాలు, శత దినోత్సవాల సెంటర్ల గురించి గొప్పగా చెప్పుకుని.. ఆ రికార్డుల గురించి మాట్లాడుకునే రోజులు ఎప్పుడో పోయాయి.
ఇలాంటి టైంలో మన సినిమా ఒకటి ఒక దేశంలో రెండొందలకు పైగా సెంటర్లలో వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడం అన్నది అనూహ్యమైన విషయం. వంద రోజుల రన్నే ఊహకందని విషయం అంటే.. ఆ తర్వాత కూడా అన్ని సెంటర్లలో సినిమా ప్రదర్శన కొనసాగుతుండటం ఇంకా ఆశ్చర్యం.
ఈ ఉపోద్ఘాతం అంతా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించే అని ఈపాటికే అర్థమై ఉంటుంది.
గత ఏడాది నవంబర్లో జపాన్లో భారీ ఎత్తున ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయగా.. విడుదలైన తొలి రోజు నుంచి సంచలనం రేపుతూ సాగుతోంది. జపాన్లో మన లాగా రెండు మూడు వారాలకు కొత్త సినిమాలను లేపేసే ట్రెండు ఇంకా రాలేదు. మన దగ్గర ఒకప్పుడు ఉన్నట్లే అక్కడ సినిమాలకు లాంగ్ రన్ ఉంటోంది. ఐతే జపాన్లో లోకల్ సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా ‘ఆర్ఆర్ఆర్’ అదిరిపోయే వసూళ్లతో ఏకంగా 200కు పైగా సెంటర్లలో వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడం మాత్రం అనూహ్యం.
జపాన్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ‘ముత్తు’ పేరిట ఉన్న 400 మిలియన్ యాన్ల రికార్డును కొన్ని వారాల్లోనే దాటేసిన ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పటికే వెయ్యి మిలియన్ యాన్ల మైలురాయిని కూడా టచ్ చేసింది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ఆ దేశంలో 120 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు కూడా 202 సెంటర్లలో సినిమా ఆడుతుండటం విశేషం. ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీం గర్వంగా ట్విట్టర్లో ప్రకటించింది. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంతో ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కు జపాన్లో మరింత డిమాండ్ కనిపిస్తోందట.
This post was last modified on March 16, 2023 2:04 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…