నేచురల్ స్టార్ నాని ఇప్పటిదాకా రకరకాల జానర్లలో సినిమాలు చేశాడు కానీ.. కమర్షియల్గా అవన్నీ కూడా ఒక స్థాయిలోనే ఉన్నాయి. ‘భలే భలే మగాడివోయ్’తో చిన్న స్థాయి నుంచి ఒకేసారి కొన్ని మెట్లు ఎక్కేసిన నాని.. ఆ తర్వాత ఆ రేంజే మెయింటైన్ చేస్తూ వచ్చాడు. తన సినిమాల బడ్జెట్లు.. బిజినెస్.. ఓపెనింగ్స్.. ఓవరాల్ వసూళ్లు.. ఇవన్నీ కూడా మిడ్ రేంజ్లో కొనసాగుతూ వచ్చాయి. హిట్టయితే ఇంత.. ఫ్లాప్ అయితే ఇంత అని ఒక లెక్క ఉండేది. చాలా ఏళ్ల నుంచి ఈ రేంజిలోనే నాని కొనసాగుతూ వచ్చాడు.
ఐతే ఇప్పుడు నాని కెరీర్ను.. అతడి బాక్సాఫీస్ లెక్కల్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లే సినిమాలా ‘దసరా’ కనిపిస్తోంది. ఈ సినిమా మేకింగ్ దశలోనే స్థాయిని పెంచుకుంది. నాని మార్కెట్ స్థాయిని మించి బడ్జెట్ పెట్టేశాడు నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఆ మొత్తం 60 కోట్లని వార్తలు రావడం పెద్ద షాక్.
ఐతే టీజర్ రిలీజైన దగ్గర్నుంచి సినిమాకు హైప్ అనూహ్యంగా పెరిగిపోవడం.. థియేట్రికల్ హక్కులతో పాటు ఇతర రైట్స్ కూడా భారీ రేటు పలికాయి. ఊహించని విధంగా బిజినెస్ రూ.80 కోట్ల స్థాయికి వెళ్లిపోయింది. సినిమా రిలీజ్కు రెడీ అవుతుండగా.. ప్రమోషన్ల జోరు బాగా పెంచింది నాని అండ్ కో. పాన్ ఇండియా స్థాయిలో హైప్ తేవడానికి గట్టిగా కృషి జరుగుతోంది. నిన్న రిలీజైన ట్రైలర్ మాస్కు బాగానే ఎక్కేసినట్లు కనిపిస్తోంది. నానిని మాస్ హీరోగా చూడడమే అరుదు అనుకుంటే.. అతను ఊర మాస్గా కనిపించేశాడు.
సినిమాకు ఓపెనింగ్స్ వరకు గట్టిగానే వచ్చేలా కనిపిస్తోంది. టాక్ బాగుంటే.. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల మోత మోగిపోవడం ఖాయం. ఇతర భాషల్లో ఓ మోస్తరుగా ప్రభావం చూపినా చాలు సినిమా రేంజే కాదు.. నాని కెరీర్ స్థాయి కూడా ఒక్కసారిగా మారిపోతుంది. మిడ్ రేంజ్, టాప్ లీగ్కు మధ్యలో నాని ఒక కొత్త లీగ్లోకి అడుగు పెడతాడనడంలో సందేహం లేదు.
This post was last modified on March 15, 2023 5:51 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…