ఈ రోజుల్లో హీరోను రాముడు మంచి బాలుడిలా చూపించి.. సందేశాలు ఇస్తూ.. మంచి మంచి విషయాలు చెబుతూ సినిమా తీస్తే చూసే ఓపిక యువ ప్రేక్షకులకు ఉండట్లేదు. హీరో క్యారెక్టర్ తేడాగా ఉండి.. వీలైతే నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండి.. సినిమా క్రేజీ క్రేజీగా నడిస్తేనే యూత్కు ఎక్కుతోంది. సినిమాలకు మహరాజ పోషకులు యువతే కాబట్టి వాళ్ల అభిరుచిని బట్టే సినిమాలు తీస్తుంటారు ఫిలిం మేకర్స్.
గత కొన్నేళ్ల ట్రెండును గమనిస్తే ‘అర్జున్ రెడ్డి’ మొదలుకుని ‘పుష్ప’ వరకు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే యువతకు ఎక్కువ నచ్చుతున్నాయి. హీరోది మంచి పాత్ర.. ఇది మంచి సినిమా అంటే బూతుల్లాగా అయిపోయాయి ఈ రోజుల్లో. ఇలాంటి ముద్ర వేయించుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటోంది. ఇలాంటి సమయంలో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ ఒక ‘మంచి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే.. రంగమార్తాండ.
చాన్నాళ్ల పాటు మేకింగ్ దశలో ఉండి ఎట్టకేలకు రిలీజవుతున్న ‘రంగమార్తాండ’కు ట్రేడ్ వర్గాల్లో… ప్రేక్షకుల్లో ఆశించినంత బజ్ అయితే లేని మాట వాస్తవం. ఐతే రిలీజ్ ముంగిట ఈ సినిమాను సినీ ప్రముఖులతో పాటు మీడియా వాళ్లకు వరుసబెట్టి స్పెషల్ షోలు వేస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ కృష్ణవంశీ ఈజ్ బ్యాక్ అని.. చాలా హృద్యంగా తీశారని.. ఇది మంచి సినిమా అని అంటున్నారు. సినిమా వాళ్లతో పాటు మీడియా వాళ్లు కూడా ‘రంగమార్తాండ’ గురించి పాజిటివ్ ట్వీట్లు వేసి ప్రమోట్ చేస్తున్నారు. అందరూ ముక్తకంఠంతో ఇందులోని ఎమోషన్లు, సెంటిమెంట్.. విలువల గురించి చెబుతున్నారు. కన్నీళ్లు పెట్టించే సినిమా ఇదని అంటున్నారు.
ఐతే ఇలాంటి ‘మంచి’ సినిమాలను ఇప్పటి యువత ఏమేర ఆదరిస్తారన్నదే సందేహంగా ఉంది. ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానున్న ‘రంగమార్తాండ’ను కృష్ణవంశీ అభిమానులు ఎంతమాత్రం ఓన్ చేసుకుంటారు.. ఇప్పటి యువత ఈ చిత్రానికి ఎంతమేర కనెక్ట్ అవుతారు అన్నది చూడాలి.
This post was last modified on March 15, 2023 5:36 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…