ఈ రోజుల్లో హీరోను రాముడు మంచి బాలుడిలా చూపించి.. సందేశాలు ఇస్తూ.. మంచి మంచి విషయాలు చెబుతూ సినిమా తీస్తే చూసే ఓపిక యువ ప్రేక్షకులకు ఉండట్లేదు. హీరో క్యారెక్టర్ తేడాగా ఉండి.. వీలైతే నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండి.. సినిమా క్రేజీ క్రేజీగా నడిస్తేనే యూత్కు ఎక్కుతోంది. సినిమాలకు మహరాజ పోషకులు యువతే కాబట్టి వాళ్ల అభిరుచిని బట్టే సినిమాలు తీస్తుంటారు ఫిలిం మేకర్స్.
గత కొన్నేళ్ల ట్రెండును గమనిస్తే ‘అర్జున్ రెడ్డి’ మొదలుకుని ‘పుష్ప’ వరకు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే యువతకు ఎక్కువ నచ్చుతున్నాయి. హీరోది మంచి పాత్ర.. ఇది మంచి సినిమా అంటే బూతుల్లాగా అయిపోయాయి ఈ రోజుల్లో. ఇలాంటి ముద్ర వేయించుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటోంది. ఇలాంటి సమయంలో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ ఒక ‘మంచి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే.. రంగమార్తాండ.
చాన్నాళ్ల పాటు మేకింగ్ దశలో ఉండి ఎట్టకేలకు రిలీజవుతున్న ‘రంగమార్తాండ’కు ట్రేడ్ వర్గాల్లో… ప్రేక్షకుల్లో ఆశించినంత బజ్ అయితే లేని మాట వాస్తవం. ఐతే రిలీజ్ ముంగిట ఈ సినిమాను సినీ ప్రముఖులతో పాటు మీడియా వాళ్లకు వరుసబెట్టి స్పెషల్ షోలు వేస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ కృష్ణవంశీ ఈజ్ బ్యాక్ అని.. చాలా హృద్యంగా తీశారని.. ఇది మంచి సినిమా అని అంటున్నారు. సినిమా వాళ్లతో పాటు మీడియా వాళ్లు కూడా ‘రంగమార్తాండ’ గురించి పాజిటివ్ ట్వీట్లు వేసి ప్రమోట్ చేస్తున్నారు. అందరూ ముక్తకంఠంతో ఇందులోని ఎమోషన్లు, సెంటిమెంట్.. విలువల గురించి చెబుతున్నారు. కన్నీళ్లు పెట్టించే సినిమా ఇదని అంటున్నారు.
ఐతే ఇలాంటి ‘మంచి’ సినిమాలను ఇప్పటి యువత ఏమేర ఆదరిస్తారన్నదే సందేహంగా ఉంది. ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానున్న ‘రంగమార్తాండ’ను కృష్ణవంశీ అభిమానులు ఎంతమాత్రం ఓన్ చేసుకుంటారు.. ఇప్పటి యువత ఈ చిత్రానికి ఎంతమేర కనెక్ట్ అవుతారు అన్నది చూడాలి.
This post was last modified on March 15, 2023 5:36 pm
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…