Movie News

టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఇరట్టా హీరో

సోషల్ మీడియాలో గత రెండు వారాలుగా విపరీతమైన చర్చకు గురైన సినిమా మలయాళం ఇరట్ట. జోజు జార్జ్ అనే క్యారెక్టర్ నటుడు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఆయనే విలన్ కూడా. పోలీస్ గా పని చేసే కవల సోదరుల్లో ఒకడు హత్యకు గురైతే అదే డిపార్ట్ మెంట్ లో పై అధికారిగా ఉన్న సోదరుడు కేస్ ఇన్వెస్టిగేట్ చేయడం ఇందులో మెయిన్ పాయింట్. కాకపోతే చనిపోక ముందు శాడిస్ట్ గా ఒక పాత్రలో జోజు నటన, క్లైమాక్స్ లో ఇచ్చే మతిపోయే మలుపు చాలా కాలం వెంటాడుతూనే ఉంటుంది. రెగ్యులర్ ట్విస్టులకు భిన్నంగా మైండ్ డిస్టర్బ్ అయ్యేలా తీసిన తీరు ట్రెండింగ్ లో ఉంది

ఇప్పుడీ విలక్షణ నటుడిని టాలీవుడ్ కు పట్టుకొచ్చారు. వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న విలేజ్ డ్రామాలో ముఖ్యమైన క్యారెక్టర్ కోసం జోజు జార్జ్ ని లాక్ చేశారు. ఉప్పెన తర్వాత కొండపోలం, రంగరంగ వైభవంగా రెండు డిజాస్టర్ కావడంతో వైష్ణవ్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. రొటీన్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా కాస్త డిఫరెంట్ గా ఫాంటసీ టచ్ తో తీస్తున్నట్టుగా టాక్ ఉంది. కొన్నేళ్ల క్రితం మంచు మనోజ్ తో మొదలుపెట్టి ఆపేసిన అహం బ్రహ్మాస్మి డైరెక్టర్ ఈ శ్రీకాంత్ రెడ్డే. కథ మార్చారా లేక అదే తీసుకున్నారా ఇంకా తెలియలేదు

మొత్తానికి మరో టాలెంటెడ్ యాక్టర్ తెలుగుకు పరిచయం కాబోతున్నాడు. ఇతని ఘనతని కేవలం ఇరట్టా కోణంలోనే చూడకూడదు. ఆ మధ్య రాజశేఖర్ రీమేక్ చేసిన శేఖర్ ఒరిజినల్ వెర్షన్ జోసెఫ్ లో నటనకు గాను స్పెషల్ మెన్షన్ క్యాటగిరీలో జాతీయ అవార్డు సాధించాడు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ఫిలిం ఫేర్ లు గట్రా చాలానే వచ్చాయి. కేవలం నాలుగేళ్ల కాలంలో ఇరవై దాకా పురస్కారాలు దక్కించుకోవడం ఈ జోజు జార్జ్ ప్రత్యేకత. ఇప్పుడు లాంచ్ కాబోయే సినిమా కనక బ్లాక్ బస్టర్ అయితే ఇక్కడా అవకాశాలు వెల్లువెత్తుతాయి. కాకపోతే అంత సులభంగా దొరకడు

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago