ఒక హిందీ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం. అందులోనూ కరోనా తర్వాత పరిస్థితి నార్త్ బాక్సాఫీస్ కు మరీ దారుణంగా మారిపోయింది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, కాంతార లాంటి సౌత్ డబ్బింగులు లేకపోతే అలో లక్ష్మణా అంటూ గగ్గోలు పెట్టాల్సి వచ్చేది. పఠాన్ దీన్ని సమూలంగా మార్చేసింది. కంటెంట్ ఎంత రొటీన్ యాక్షన్ తో ఉన్నా మాస్ కి నచ్చేలా ఒక సూపర్ స్టార్ ని చూపిస్తే కనక కనక వర్షం ఎలా కురుస్తుందో నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ 1000 కోట్లను దాటించేసి మరీ నిరూపించారు.
ఈ రోజు పఠాన్ 50 రోజులను పూర్తి చేసుకుంది. అది కూడా ఆషామాషీగా కాదు. ఇవాళ్టికి దేశవ్యాప్తంగా 800 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా మరో 135 థియేటర్లలో ఆడుతూనే ఉంది. వీటిలో రెగ్యులర్ షోలు, షిఫ్టింగ్ లు అన్నీ కలిసే ఉన్నాయి. ఇది మాములు ఫీట్ కాదు. ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమాలకే ఫిఫ్టీ డేస్ అనేది కష్టంగా మారింది. ఆస్కార్ తెచ్చిన ట్రిపులార్ సైతం కౌంట్ పరంగా ఇంత నెంబర్ తెచ్చుకోలేదు. ఆ రకంగా చూస్తే షారుఖ్ ఖాన్ బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ ఏ స్థాయిలో పని చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో రెండు వారాలకు పైగా ఈజీ రన్ ఉంటుందని ట్రేడ్ చెబుతోంది.
ఈ జోరు కారణంగా పఠాన్ ఓటిటి స్ట్రీమింగ్ ని వాయిదా వేసుకున్నారు. ఈ వారంలోనే అనౌన్స్ మెంట్ ఉండబోతోంది. థియేటర్ లో చూసింది కాకుండా ఎడిట్ చేయని అన్ కట్ వెర్షన్ ని అమెజాన్ ప్రైమ్ లో తీసుకురాబోతున్నారు. వ్యూస్ పరంగా భారీ రికార్డులు నమోదవ్వడం ఖాయమని డిజిటల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పఠాన్ తర్వాత కొత్త రిలీజులు చాలనే వచ్చాయి కానీ అవేవి కింగ్ ఖాన్ మీద పెద్ద ప్రభావం చూపించలేకపోయాయి. సెల్ఫీ, షెహజాదా డిజాస్టర్ కాగా తూ ఝూటి మై మక్కర్ డీసెంట్ గా వర్కౌట్ చేసుకుని లాభాలతో బయటపడేలా ఉంది.
This post was last modified on March 15, 2023 11:48 am
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…