ప్రస్తుతం ఓటీటీ సంస్థల మధ్య గట్టి పోటీ ఉంది. మార్కెట్ ను బట్టి ఎవరి ప్రమోషన్ వారు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే ఆహా మాత్రం ఆ విషయంలో ఇంకాస్త ముందుంది. అవును ఆహా పెట్టినప్పుడు స్వంత హీరో అల్లు అర్జున్ ను , అలాగే కొంత భాగస్వామి అయిన విజయ్ దేవరకొండ ను బాగా వాడుకున్నారు. ఆహా అనే ఓటీటీ ఉందని జనాలకి రీచ్ చేయడంలో బన్నీ కీలక పాత్ర పోషించాడు. ఇక క్రాక్ సినిమాతో ఆహా ఒక్కసారిగా సబ్ స్క్రిప్షన్స్ పెంచేసుకుంది.
ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలతో బండి లాగించింది. కానీ ఎప్పుడైతే బాలయ్య టాక్ షోతో ఆహాలో ఎంట్రీ ఇచ్చాడో అక్కడి నుండి ఈ ఓటీటీ అందరికీ చేరువైంది. బాలయ్య అన్ స్టాపబుల్ షోతో ఆహా బాగా లాభపడింది. దీంతో బాలయ్యను ఆహాకి మెల్లగా బ్రాండ్ అంబాసిడర్ చేసేశారు అల్లు అరవింద్. అన్ స్టాపబుల్ షోకి సంబంధం లేకుండా మధ్యలో బాలయ్యను సింగర్స్ షో ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 1 కి గెస్ట్ తీసుకొచ్చారు.
తాజాగా మరోసారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే కి బాలయ్యను స్పెషల్ గెస్ట్ గా తీసుకొచ్చి నందమూరి హీరోతో ఓ సాంగ్ కి పెర్ఫార్మ్ కూడా చేయించారు. ఏదేమైనా బాలయ్యను ఆహా వాడుకుంటున్నట్లు మరెవరూ వాడలేరేమో. బాలయ్య అప్పిరియన్స్ తో ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 2 గ్రాండ్ ఫినాలే కి ఏ రేంజ్ వ్యూస్ వస్తాయో చూడాలి.
This post was last modified on March 14, 2023 10:16 pm
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…