బాలీవుడ్ డెబ్యూ కోసం ఏకంగా మూడేళ్ళ విలువైన టాలీవుడ్ కెరీర్ ని పణంగా పెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఛత్రపతి హిందీ రీమేక్ కి రూట్ క్లియరైనట్టుగా తాజా సమాచారం. నిజానికి షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా విడుదల ఎందుకు ఆలస్యమవుతూ వచ్చిందో ఎవరికీ తెలియలేదు. దీని దర్శకుడు వివి వినాయక్ హైదరాబాద్ లోనే ఉంటున్నా అప్పుడప్పుడు ఇతర అంశాల మీద మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నా చతప్రతి ప్రస్తావన రాకుండా ముందే యాంకర్లకు చెప్పి మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అందుకే క్లారిటీ లేకుండా పోయింది.
ఆఖరికి ఓటిటిలో వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. ఫైనల్ గా మే 5 థియేటర్లలోనే తీసుకొస్తారట. ఇంత జాప్యం జరగడానికి టైటిల్ విషయంలో జరిగిన రగడే కారణమట. వేరే బాలీవుడ్ నిర్మాత ఒకరు దాన్ని రిజిస్టర్ చేసి పెట్టుకోవడం, తీరా అడిగే సమయానికి ఆయన ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేయడం ఇలాంటి పరిణామాల వల్ల నిర్మాతలు వెనుకడుగు వేస్తూ వచ్చారు. ఈ పేరు తప్ప ఇంకేదీ సూటవ్వదని భావించిన పెన్ అధినేతలు ఫైనల్ గా ఆ మొత్తాన్ని సమర్పించుకుని దారి సుగమం చేసుకున్నారని తెలిసింది. దీనికే నెలల సమయం గడిచిపోయింది.
అంతా బాగానే ఉంది కానీ ఇంత ఖర్చు పెట్టి తీసిన ఛత్రపతికి రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని టెన్షన్ యూనిట్ లో లేకపోలేదు. ఎందుకంటే హిందీ డబ్బింగ్ వెర్షన్ ని యూట్యూబ్ లో, శాటిలైట్ ఛానల్స్ లో నార్త్ ఆడియన్స్ విచ్చలవిడిగా చూసేశారు. ఇప్పుడు ప్రభాస్ స్థానంలో సాయిశ్రీనివాస్ ని ఒప్పుకుంటారా అనేది పెద్ద భేతాళ ప్రశ్న. ఈ మీమాంస కూడా చాలా కాలం మేకర్స్ ని వెంటాడిందని ఇన్ సైడ్ టాక్. ఏదైతేనేం మొత్తానికి గుమ్మడికాయ పడిపోయింది. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ చంద్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లం హీరో దాన్ని అఫీషియల్ గా ప్రకటించడమొకటే బాకీ.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…