బాలీవుడ్ డెబ్యూ కోసం ఏకంగా మూడేళ్ళ విలువైన టాలీవుడ్ కెరీర్ ని పణంగా పెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఛత్రపతి హిందీ రీమేక్ కి రూట్ క్లియరైనట్టుగా తాజా సమాచారం. నిజానికి షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా విడుదల ఎందుకు ఆలస్యమవుతూ వచ్చిందో ఎవరికీ తెలియలేదు. దీని దర్శకుడు వివి వినాయక్ హైదరాబాద్ లోనే ఉంటున్నా అప్పుడప్పుడు ఇతర అంశాల మీద మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నా చతప్రతి ప్రస్తావన రాకుండా ముందే యాంకర్లకు చెప్పి మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అందుకే క్లారిటీ లేకుండా పోయింది.
ఆఖరికి ఓటిటిలో వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. ఫైనల్ గా మే 5 థియేటర్లలోనే తీసుకొస్తారట. ఇంత జాప్యం జరగడానికి టైటిల్ విషయంలో జరిగిన రగడే కారణమట. వేరే బాలీవుడ్ నిర్మాత ఒకరు దాన్ని రిజిస్టర్ చేసి పెట్టుకోవడం, తీరా అడిగే సమయానికి ఆయన ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేయడం ఇలాంటి పరిణామాల వల్ల నిర్మాతలు వెనుకడుగు వేస్తూ వచ్చారు. ఈ పేరు తప్ప ఇంకేదీ సూటవ్వదని భావించిన పెన్ అధినేతలు ఫైనల్ గా ఆ మొత్తాన్ని సమర్పించుకుని దారి సుగమం చేసుకున్నారని తెలిసింది. దీనికే నెలల సమయం గడిచిపోయింది.
అంతా బాగానే ఉంది కానీ ఇంత ఖర్చు పెట్టి తీసిన ఛత్రపతికి రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని టెన్షన్ యూనిట్ లో లేకపోలేదు. ఎందుకంటే హిందీ డబ్బింగ్ వెర్షన్ ని యూట్యూబ్ లో, శాటిలైట్ ఛానల్స్ లో నార్త్ ఆడియన్స్ విచ్చలవిడిగా చూసేశారు. ఇప్పుడు ప్రభాస్ స్థానంలో సాయిశ్రీనివాస్ ని ఒప్పుకుంటారా అనేది పెద్ద భేతాళ ప్రశ్న. ఈ మీమాంస కూడా చాలా కాలం మేకర్స్ ని వెంటాడిందని ఇన్ సైడ్ టాక్. ఏదైతేనేం మొత్తానికి గుమ్మడికాయ పడిపోయింది. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ చంద్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లం హీరో దాన్ని అఫీషియల్ గా ప్రకటించడమొకటే బాకీ.
This post was last modified on March 14, 2023 4:25 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…