ఇంకో రెండు వారాల్లో విడుదల కాబోతున్న దసరా మీద అంచనాలు మాములుగా లేవు. తన మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ప్రమోషన్ల పరంగా నాని చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. అన్ని బాషల ఆడియన్స్ కి చేరువ చేసే ఉద్దేశంతో దేశం మొత్తం ప్రధాన నగరాలు తిరుగుతూ తనను తాను కొత్తగా లాంచ్ చేసుకుంటున్నాడు. మార్చి 30 మంచి డేట్ కావడంతో తమిళ హిందీ కన్నడలో చెప్పుకోదగ్గ పోటీ ఉంది. వాటికి ధీటుగా నిలబడి ఓపెనింగ్స్ సాధించుకోవాలంటే కంటెంట్ బలంగా ఉందనే సందేశం జనంలోకి వెళ్ళాలి. నాని ఇప్పుడు చేస్తున్నది అదే.
ఇక విషయానికి వస్తే కీర్తి సురేష్ దసరాలో హీరోయిన్ అయినప్పటికీ ట్విట్టర్ లో తప్ప ఇప్పటిదాకా తానుగా ముందుకొచ్చి యాక్టివ్ గా ప్రమోట్ చేసింది లేదు. దానికి కారణం ఒకటే. తను ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటోంది. చిరంజీవి భోళాశంకర్ కీలక షెడ్యూల్ లో పాల్గొంటోంది. కోటి విమెన్ కాలేజీలో షూట్ జరుగుతోంది. మరికొన్ని సన్నివేశాలు సిటీలోనే అవుట్ డోర్ లో తీయబోతున్నారు. ఓ వారంలో ఇది పూర్తవ్వొచ్చట. తర్వాత చేతిలో ఉన్న పది రోజులు కంప్లీట్ గా దసరాకే ఇచ్చి నానితో పాటు ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో పాల్గొనబోతోంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం దసరాలో కీర్తికి పెర్ఫార్మన్స్ కి చాలా స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చాడట దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఫస్ట్ హాఫ్ లో జాలీగా కనిపించే నాని ప్రీ ఇంటర్వెల్ నుంచి ఉగ్ర నరసింహావతారం ఎత్తేందుకు కారణమయ్యే కీలకమైన ఎపిసోడ్ లో ఈ ఇద్దరి పెర్ఫార్మన్స్ కు థియేటర్లలో చప్పట్లు పడటం ఖాయమని అంటున్నారు. ఛార్ట్ బస్టర్ అయిన చమ్కీల అంగీ పాట స్క్రీన్ మీద అంతే గొప్పగా వచ్చిందని వినికిడి. తెలుగులో సోలోగా చేసిన మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి లాంటివి కనీస స్థాయిలో ఆడకపోవడంతో పాటు సర్కారు వారి పాట వల్ల ఏమంత ప్రయోజనం కలగకపోవడంతో కీర్తి ఆశలన్నీ దసరా మీదున్నాయి.
This post was last modified on March 14, 2023 11:28 am
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…