మనం ఎంత గొప్ప సినిమా తీశామన్నది ముఖ్యం కాదు. దాన్ని ఎంత ఎక్కువ ప్రేక్షకులకు, దేశాలకు చేరవేశామన్నది కీలకం. ఒకప్పుడు విశ్వనాథ్ గారి అద్భుత చిత్రాలు శంకరాభరణం, సాగర సంగమం, స్వయంకృషి లాంటివి విదేశీ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి గౌరవం దక్కించుకున్నాయి కానీ అంతకు మించి ఆస్కార్ నామినేషన్ల దాకా ఏవీ వెళ్ళలేదు. అలా అని గొప్ప సినిమాలు రాలేదని కాదు. ఎన్నో వచ్చాయి. టి కృష్ణ, దాసరి నారాయణరావు లాంటి ఎందరో ఉద్దండులు సామాజిక అంశాల మీద ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ అవేవీ ప్రపంచం మొత్తానికి తెలియదు.
కానీ రాజమౌళి చరిత్ర తిరగరాసి చూపించాడు. ఆర్ఆర్ఆర్ ను విదేశీయులు సొంతం చేసుకోవడం చూసి ఆలోచించాడు. అందులో ఎమోషన్ భాషతో సంబంధం లేకుండా ఎక్కడో యుకె లండన్ లాంటి దేశాల్లో కనెక్ట్ అవ్వడం చూసి నమ్మకం పెంచుకున్నాడు. అమెరికాలో ప్రీమియర్లు వేస్తుంటే హౌస్ ఫుల్స్ కావడం గమనించాడు. థియేటర్ల లోపల నాటు నాటుకి డాన్స్ చేయడం చూసి ధీమాగా ముందుకెళ్ళడం మొదలుపెట్టాడు. దానికి తగ్గ గొప్ప ఫలితమే ఇప్పుడు కళ్ళముందు కనిపిస్తోంది. జక్కన్నా నీకు సాటి ఎవరన్నా అంటూ అభిమానులు పొగడ్తల కోసం మాటలు వెతుకుతున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళి ఇప్పటి జనరేషన్ తో పాటు రాబోయే తరం దర్శకులకు ఒక మార్గదర్శకత్వం చేశారు. ఒరిజినాలిటీకి నేటివిటీకి కట్టుబడితే ఆస్కార్ అయినా సలామ్ కొడుతుందని చాటి చెప్పాడు. ఆ పాటలో ఎలాంటి ఇంగ్లీష్ పదాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే మన పిల్లలకే అంత సులభంగా అర్థం కాని కొన్ని తెలుగు మాటలున్నాయి. అయినా ఫారినర్స్ ఊగిపోయారు. కీరవాణి పాటలో ఉన్న ఆత్మ గొప్పగా పండింది. చంద్రబోస్ సాహిత్యం ప్రత్యేక పాత్ర పోషించింది. ఇప్పుడు ఎందరికో ధైర్యం వచ్చింది. ఆస్కార్ కలలోనే కాదు నిజం చేసుకోవడానికీ దారి ఉందని జక్కన్నను చూసి నేర్చేసుకున్నారు.
This post was last modified on March 13, 2023 10:41 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…