మనం ఎంత గొప్ప సినిమా తీశామన్నది ముఖ్యం కాదు. దాన్ని ఎంత ఎక్కువ ప్రేక్షకులకు, దేశాలకు చేరవేశామన్నది కీలకం. ఒకప్పుడు విశ్వనాథ్ గారి అద్భుత చిత్రాలు శంకరాభరణం, సాగర సంగమం, స్వయంకృషి లాంటివి విదేశీ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి గౌరవం దక్కించుకున్నాయి కానీ అంతకు మించి ఆస్కార్ నామినేషన్ల దాకా ఏవీ వెళ్ళలేదు. అలా అని గొప్ప సినిమాలు రాలేదని కాదు. ఎన్నో వచ్చాయి. టి కృష్ణ, దాసరి నారాయణరావు లాంటి ఎందరో ఉద్దండులు సామాజిక అంశాల మీద ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ అవేవీ ప్రపంచం మొత్తానికి తెలియదు.
కానీ రాజమౌళి చరిత్ర తిరగరాసి చూపించాడు. ఆర్ఆర్ఆర్ ను విదేశీయులు సొంతం చేసుకోవడం చూసి ఆలోచించాడు. అందులో ఎమోషన్ భాషతో సంబంధం లేకుండా ఎక్కడో యుకె లండన్ లాంటి దేశాల్లో కనెక్ట్ అవ్వడం చూసి నమ్మకం పెంచుకున్నాడు. అమెరికాలో ప్రీమియర్లు వేస్తుంటే హౌస్ ఫుల్స్ కావడం గమనించాడు. థియేటర్ల లోపల నాటు నాటుకి డాన్స్ చేయడం చూసి ధీమాగా ముందుకెళ్ళడం మొదలుపెట్టాడు. దానికి తగ్గ గొప్ప ఫలితమే ఇప్పుడు కళ్ళముందు కనిపిస్తోంది. జక్కన్నా నీకు సాటి ఎవరన్నా అంటూ అభిమానులు పొగడ్తల కోసం మాటలు వెతుకుతున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళి ఇప్పటి జనరేషన్ తో పాటు రాబోయే తరం దర్శకులకు ఒక మార్గదర్శకత్వం చేశారు. ఒరిజినాలిటీకి నేటివిటీకి కట్టుబడితే ఆస్కార్ అయినా సలామ్ కొడుతుందని చాటి చెప్పాడు. ఆ పాటలో ఎలాంటి ఇంగ్లీష్ పదాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే మన పిల్లలకే అంత సులభంగా అర్థం కాని కొన్ని తెలుగు మాటలున్నాయి. అయినా ఫారినర్స్ ఊగిపోయారు. కీరవాణి పాటలో ఉన్న ఆత్మ గొప్పగా పండింది. చంద్రబోస్ సాహిత్యం ప్రత్యేక పాత్ర పోషించింది. ఇప్పుడు ఎందరికో ధైర్యం వచ్చింది. ఆస్కార్ కలలోనే కాదు నిజం చేసుకోవడానికీ దారి ఉందని జక్కన్నను చూసి నేర్చేసుకున్నారు.
This post was last modified on March 13, 2023 10:41 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…