మనం ఎంత గొప్ప సినిమా తీశామన్నది ముఖ్యం కాదు. దాన్ని ఎంత ఎక్కువ ప్రేక్షకులకు, దేశాలకు చేరవేశామన్నది కీలకం. ఒకప్పుడు విశ్వనాథ్ గారి అద్భుత చిత్రాలు శంకరాభరణం, సాగర సంగమం, స్వయంకృషి లాంటివి విదేశీ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి గౌరవం దక్కించుకున్నాయి కానీ అంతకు మించి ఆస్కార్ నామినేషన్ల దాకా ఏవీ వెళ్ళలేదు. అలా అని గొప్ప సినిమాలు రాలేదని కాదు. ఎన్నో వచ్చాయి. టి కృష్ణ, దాసరి నారాయణరావు లాంటి ఎందరో ఉద్దండులు సామాజిక అంశాల మీద ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ అవేవీ ప్రపంచం మొత్తానికి తెలియదు.
కానీ రాజమౌళి చరిత్ర తిరగరాసి చూపించాడు. ఆర్ఆర్ఆర్ ను విదేశీయులు సొంతం చేసుకోవడం చూసి ఆలోచించాడు. అందులో ఎమోషన్ భాషతో సంబంధం లేకుండా ఎక్కడో యుకె లండన్ లాంటి దేశాల్లో కనెక్ట్ అవ్వడం చూసి నమ్మకం పెంచుకున్నాడు. అమెరికాలో ప్రీమియర్లు వేస్తుంటే హౌస్ ఫుల్స్ కావడం గమనించాడు. థియేటర్ల లోపల నాటు నాటుకి డాన్స్ చేయడం చూసి ధీమాగా ముందుకెళ్ళడం మొదలుపెట్టాడు. దానికి తగ్గ గొప్ప ఫలితమే ఇప్పుడు కళ్ళముందు కనిపిస్తోంది. జక్కన్నా నీకు సాటి ఎవరన్నా అంటూ అభిమానులు పొగడ్తల కోసం మాటలు వెతుకుతున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళి ఇప్పటి జనరేషన్ తో పాటు రాబోయే తరం దర్శకులకు ఒక మార్గదర్శకత్వం చేశారు. ఒరిజినాలిటీకి నేటివిటీకి కట్టుబడితే ఆస్కార్ అయినా సలామ్ కొడుతుందని చాటి చెప్పాడు. ఆ పాటలో ఎలాంటి ఇంగ్లీష్ పదాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే మన పిల్లలకే అంత సులభంగా అర్థం కాని కొన్ని తెలుగు మాటలున్నాయి. అయినా ఫారినర్స్ ఊగిపోయారు. కీరవాణి పాటలో ఉన్న ఆత్మ గొప్పగా పండింది. చంద్రబోస్ సాహిత్యం ప్రత్యేక పాత్ర పోషించింది. ఇప్పుడు ఎందరికో ధైర్యం వచ్చింది. ఆస్కార్ కలలోనే కాదు నిజం చేసుకోవడానికీ దారి ఉందని జక్కన్నను చూసి నేర్చేసుకున్నారు.
This post was last modified on March 13, 2023 10:41 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…