కొణిదెల నిహారికను చూస్తే మెగా అభిమానులకు అయ్యో అనిపించకుండా ఉండదు. ఎన్నో రోజులు ఓపిక పట్టి, తమ కుటుంబ పెద్దలందరినీ కష్టపడి ఒప్పించి కథానాయిక అవతారం ఎత్తిందామె. కానీ ఆమెకు ఇక్కడ అదృష్టం కలిసి రాలేదు. నాలుగేళ్ల వ్యవధిలో నాలుగు సినిమాలు చేస్తే ఆ నాలుగూ ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
నిహారిక తొలి సినిమా ‘ఒక మనసు’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. తమిళంలో విజయ్ సేతుపతి లాంటి క్రేజీ హీరోతో కలిసి ‘ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్’ అనే డార్క్ కామెడీ మూవీలో నటించింది. ఆ చిత్రమూ ఫ్లాపే అయింది. కట్ చేస్తే తిరిగి టాలీవుడ్ కు వచ్చి ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా చేసింది. అదీ డిజాస్టరే. ఇక చివరగా చేసిన ‘సూర్యకాంతం’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. ఈ దెబ్బతో ఆమె సినీ కెరీర్ దాదాపు క్లోజ్ అయిపోయింది.
ఈ మధ్యే నిహారికకు పెళ్లి కూడా కుదిరింది. త్వరలోనే నిశ్చితార్థం కూడా చేయబోతున్నారు. పెళ్లి కూడా ఈ ఏడాదే ఉండొచ్చు. కాబట్టి ఇక నిహారిక నటనకు టాటా చెప్పేసినట్లే అని అంతా అనుకుంటున్నారు. ఐతే నిహారిక సినీ కెరీర్ ముగిసిపోయి ఉండొచ్చు కానీ.. నటనకు మాత్రం గుడ్ బై చెప్పట్లేదని సమాచారం.
తొలిసారిగా ఆమె మెగా ఫ్యామిలీ బేనర్లో నటించబోతోందని.. అది ఒక వెబ్ సిరీస్ అని వార్తలొస్తున్నాయి. చిరంజీవి పెద్ద కూతురు సుశ్మిత ఇటీవలే సొంత బేనర్ పెట్టి వెబ్ సిరీస్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తొలి ప్రాజెక్టును ఆల్రెడీ సేల్ కూడా చేసేసిందామె. దీని తర్వాతి ప్రాజెక్టును నిహారికతో చేయనుందట. నిహారికకు పరిచయం ఉన్న ఓ యువ దర్శకుడు దాన్ని డైరెక్ట్ చేస్తాడట. పెళ్లి తర్వాత ఆమె ఇందులో నటిస్తుందని అంటున్నారు. సినిమాలు లేకపోయినా.. ఇలా అయినా కెరీర్ కొనసాగించాలని మెగా అమ్మాయి ఫిక్సయినట్లుంది.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…