కొణిదెల నిహారికను చూస్తే మెగా అభిమానులకు అయ్యో అనిపించకుండా ఉండదు. ఎన్నో రోజులు ఓపిక పట్టి, తమ కుటుంబ పెద్దలందరినీ కష్టపడి ఒప్పించి కథానాయిక అవతారం ఎత్తిందామె. కానీ ఆమెకు ఇక్కడ అదృష్టం కలిసి రాలేదు. నాలుగేళ్ల వ్యవధిలో నాలుగు సినిమాలు చేస్తే ఆ నాలుగూ ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
నిహారిక తొలి సినిమా ‘ఒక మనసు’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. తమిళంలో విజయ్ సేతుపతి లాంటి క్రేజీ హీరోతో కలిసి ‘ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్’ అనే డార్క్ కామెడీ మూవీలో నటించింది. ఆ చిత్రమూ ఫ్లాపే అయింది. కట్ చేస్తే తిరిగి టాలీవుడ్ కు వచ్చి ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా చేసింది. అదీ డిజాస్టరే. ఇక చివరగా చేసిన ‘సూర్యకాంతం’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. ఈ దెబ్బతో ఆమె సినీ కెరీర్ దాదాపు క్లోజ్ అయిపోయింది.
ఈ మధ్యే నిహారికకు పెళ్లి కూడా కుదిరింది. త్వరలోనే నిశ్చితార్థం కూడా చేయబోతున్నారు. పెళ్లి కూడా ఈ ఏడాదే ఉండొచ్చు. కాబట్టి ఇక నిహారిక నటనకు టాటా చెప్పేసినట్లే అని అంతా అనుకుంటున్నారు. ఐతే నిహారిక సినీ కెరీర్ ముగిసిపోయి ఉండొచ్చు కానీ.. నటనకు మాత్రం గుడ్ బై చెప్పట్లేదని సమాచారం.
తొలిసారిగా ఆమె మెగా ఫ్యామిలీ బేనర్లో నటించబోతోందని.. అది ఒక వెబ్ సిరీస్ అని వార్తలొస్తున్నాయి. చిరంజీవి పెద్ద కూతురు సుశ్మిత ఇటీవలే సొంత బేనర్ పెట్టి వెబ్ సిరీస్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తొలి ప్రాజెక్టును ఆల్రెడీ సేల్ కూడా చేసేసిందామె. దీని తర్వాతి ప్రాజెక్టును నిహారికతో చేయనుందట. నిహారికకు పరిచయం ఉన్న ఓ యువ దర్శకుడు దాన్ని డైరెక్ట్ చేస్తాడట. పెళ్లి తర్వాత ఆమె ఇందులో నటిస్తుందని అంటున్నారు. సినిమాలు లేకపోయినా.. ఇలా అయినా కెరీర్ కొనసాగించాలని మెగా అమ్మాయి ఫిక్సయినట్లుంది.
This post was last modified on July 28, 2020 2:22 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…