మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ బ్లాక్బస్టర్ ‘లూసిఫర్’ను రీమేక్ రీమేక్ చేస్తున్నారన్న సమాచారం బయటికి వచ్చినపుడు పెదవి విరిచిన వాళ్లే ఎక్కువమంది. ఎందుకంటే భాషల మధ్య అంతరాలు చెరిగిపోయిన డిజిటల్ యుగంలో అందరూ అన్ని భాషల సినిమాలూ చూసేస్తున్నారు.
పైగా ‘లూసిఫర్’ తెలుగులోకి కూడా అనువాదం అయింది. థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత అమేజాన్లోకి కూడా వచ్చింది. ఇక ఈ సినిమా ఏమైనా కొత్తగా ఉంటుందా అంటే అదీ లేదు. రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ఇలాంటివి తెలుగులో కూడా చాలానే వచ్చాయి. అయినా సరే.. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చిరంజీవి, రామ్ చరణ్ రెడీ అయిపోయారు. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు చిరంజీవి కొన్ని నెలల కిందట స్వయంగా వెల్లడించాడు. అందరూ అతడికే ఫిక్సయిపోయారు.
కానీ ఇప్పుడు సుజీత్ను తప్పించిన వినాయక్ను ఓకే చేసినట్లు చెబుతున్నారు. మెగా కాంపౌండ్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సుజీత్ ‘సాహో’తో చేదు అనుభవాన్ని ఎదుర్కొని ఉండొచ్చు కానీ.. అతను కొత్త ఆలోచనలున్న దర్శకుడు. స్టైలిష్ ఫిలిం మేకర్. రీమేక్ అయినా సరే.. దానికి తనదైన టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.. ఏదో కొత్తదనం, ఒరిజినల్తో పోలిస్తే మార్పు చూపిస్తాడని ఆశించారు.
కానీ అతణ్ని తప్పించి.. పూర్తిగా ఔట్ డేట్ అయిపోయిన వినాయక్ను తీసుకొచ్చారు. ఒకప్పుడు ‘ఠాగూర్’ రీమేక్తో వినాయక్ సత్తా చాటాడు. కానీ ‘ఖైదీ నంబర్ 150’కి వచ్చేసరికి సాధారణంగా మారిపోయాడు. చిరు రీఎంట్రీ మూవీ, ఒరిజినల్లో దమ్ముండటంతో ఆ సినిమా ఆడేసింది కానీ.. అందులో వినాయక్ ఘనతేమీ లేదు.
అతడి చివరి సినిమా ‘ఇంటిలిజెంట్’ చూశాక చిరు మళ్లీ అవకాశం ఇస్తున్నాడంటే ఆశ్చర్యమే. వినాయక్ ఒక జిరాక్స్ కాపీ తీసి చేతిలో పెట్టడం మినహా చేసేదేమీ ఉండకపోవచ్చు. అందుకే ఈ రీమేక్ విషయంలో ఉన్న కాస్త ఆసక్తి కూడా పోయినట్లే.
This post was last modified on July 28, 2020 4:55 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…