ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని పరిచయం చేసి తీసిన అన్ని భాషల్లో అద్భుత ఫలితాన్ని దక్కించుకున్న దృశ్యం సినిమాది ప్రత్యేక స్థానం. మొదట మలయాళంలో మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ దీన్ని రూపొందించినప్పుడు పెద్దగా అంచనాలు లేవు. హీరో ఇమేజ్ కు అనుగుణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ తీరా చూస్తే ఏకంగా మల్లువుడ్ రికార్డులను తిరగరాసే స్థాయిలో అది సాధించిన విజయం అంతా ఇంతా కాదు. విక్టరీ వెంకటేష్ టీనేజ్ అమ్మాయి తండ్రిగా నటించేందుకు వెనుకాడనంతగా మెప్పించడంతో ఇక్కడా రీమేక్ చేసి సక్సెస్ కొట్టారు.
హిందీలో అజయ్ దేవగన్ నేనేం తక్కువాని సేమ్ రిజల్ట్ అందుకున్నాడు. కానీ దృశ్యం 2 కరోనా వల్ల కొంత దారి మార్చుకోవాల్సి వచ్చింది. మలయాళం తెలుగు వెర్షన్ నిర్మాతల కమిట్ మెంట్లు, కరోనా పరిస్థితుల వల్ల డైరెక్ట్ ఓటిటికి వెళ్లిపోయాయి. రెస్పాన్స్ బ్రహ్మాండంగా వచ్చింది కానీ థియేటర్లో అయ్యుంటే రెవిన్యూ పరంగా ఎంత పెద్ద హిట్టో అర్థమయ్యేది. ఈసారి అజయ్ తొందరపడకుండా బాలీవుడ్ దృశ్యం 2ని తెలివిగా కొంత ఆలస్యం చేయించి బిగ్ స్క్రీన్ మీద కాసుల వర్షం కురిపించాడు. మూడో భాగానికి లీడ్ వదిలేసిన జీతూ జోసెఫ్ దాని స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారట.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దృశ్యం 3 ఈసారి ఏకకాలంలో మూడు భాషల్లో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మోహన్ లాల్, అజయ్ దేవగన్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో నెక్స్ట్ వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఓకే అయితే షూటింగ్ మొదలుపెట్టి రిలీజ్ దాకా అన్ని ఒకేసారి జరుగుతాయి. ఒకటి ముందు ఆ తర్వాత అనేలా రిలీజులు ఉండవు. దీనివల్ల స్టోరీ ప్లాట్ ఏంటి, ట్విస్టులేంటని ముందే లీకయ్యే గోల తప్పుతుంది. ఇది రెండో భాగానికే చేయాల్సింది కానీ ఏదైతేనేం థర్డ్ పార్ట్ మాత్రం మంచి నిర్ణయమే తీసుకున్నారు. త్వరలోనే ప్రకటన రావొచ్చు.
This post was last modified on March 12, 2023 6:30 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…