Movie News

దృశ్యం 3 కొత్త ప్లాన్ అదిరింది

ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని పరిచయం చేసి తీసిన అన్ని భాషల్లో అద్భుత ఫలితాన్ని దక్కించుకున్న దృశ్యం సినిమాది ప్రత్యేక స్థానం. మొదట మలయాళంలో మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ దీన్ని రూపొందించినప్పుడు పెద్దగా అంచనాలు లేవు. హీరో ఇమేజ్ కు అనుగుణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ తీరా చూస్తే ఏకంగా మల్లువుడ్ రికార్డులను తిరగరాసే స్థాయిలో అది సాధించిన విజయం అంతా ఇంతా కాదు. విక్టరీ వెంకటేష్ టీనేజ్ అమ్మాయి తండ్రిగా నటించేందుకు వెనుకాడనంతగా మెప్పించడంతో ఇక్కడా రీమేక్ చేసి సక్సెస్ కొట్టారు.

హిందీలో అజయ్ దేవగన్ నేనేం తక్కువాని సేమ్ రిజల్ట్ అందుకున్నాడు. కానీ దృశ్యం 2 కరోనా వల్ల కొంత దారి మార్చుకోవాల్సి వచ్చింది. మలయాళం తెలుగు వెర్షన్ నిర్మాతల కమిట్ మెంట్లు, కరోనా పరిస్థితుల వల్ల డైరెక్ట్ ఓటిటికి వెళ్లిపోయాయి. రెస్పాన్స్ బ్రహ్మాండంగా వచ్చింది కానీ థియేటర్లో అయ్యుంటే రెవిన్యూ పరంగా ఎంత పెద్ద హిట్టో అర్థమయ్యేది. ఈసారి అజయ్ తొందరపడకుండా బాలీవుడ్ దృశ్యం 2ని తెలివిగా కొంత ఆలస్యం చేయించి బిగ్ స్క్రీన్ మీద కాసుల వర్షం కురిపించాడు. మూడో భాగానికి లీడ్ వదిలేసిన జీతూ జోసెఫ్ దాని స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారట.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దృశ్యం 3 ఈసారి ఏకకాలంలో మూడు భాషల్లో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మోహన్ లాల్, అజయ్ దేవగన్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో నెక్స్ట్ వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఓకే అయితే షూటింగ్ మొదలుపెట్టి రిలీజ్ దాకా అన్ని ఒకేసారి జరుగుతాయి. ఒకటి ముందు ఆ తర్వాత అనేలా రిలీజులు ఉండవు. దీనివల్ల స్టోరీ ప్లాట్ ఏంటి, ట్విస్టులేంటని ముందే లీకయ్యే గోల తప్పుతుంది. ఇది రెండో భాగానికే చేయాల్సింది కానీ ఏదైతేనేం థర్డ్ పార్ట్ మాత్రం మంచి నిర్ణయమే తీసుకున్నారు. త్వరలోనే ప్రకటన రావొచ్చు.

This post was last modified on March 12, 2023 6:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

42 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

45 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago